Home » రాజ‌మౌళి తీసే ప్ర‌తి సినిమాలో ఆ సెంటిమెంట్ త‌ప్ప‌కుండా ఉండాల్సిందే..!

రాజ‌మౌళి తీసే ప్ర‌తి సినిమాలో ఆ సెంటిమెంట్ త‌ప్ప‌కుండా ఉండాల్సిందే..!

by Anji
Ad

సినీ ఇండస్ట్రీకి చెందిన న‌టీన‌టుల‌కు, ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు సెంటిమెంట్లు చాలానే ఉంటాయి. ఒక సినిమా ప్రారంభించిన‌ప్పటి నుంచి ఆ సినిమా విడుద‌ల వ‌ర‌కు ఎన్నో సెంటిమెంట్‌ల‌ను పాటిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో సెంటిమెంట్ ప‌రంగానే సినిమాలు విడుద‌ల చేస్తుంటారు. అలా ప్రారంభించిన హీరోల అభిమానులు కూడా కొన్ని సెంటిమెంట్ల‌ను ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా త‌మ అభిమాన హీరోల సినిమాల విష‌యంలో సెంటిమెంట్ల‌ను న‌మ్ముతుంటారు. త‌మ అభిమాన స్టార్ హీరో న‌టించిన ప్ర‌తీ సినిమాకి ఒక‌టే సెంటిమెంట్‌ను ఫాలో అవుతుంటారు.

Advertisement

ఒక్కో సినిమాలో ఆ సెంటిమెంట్ లేకుండా ఉంటే ఇక ఆ సినిమా డిజాస్ట‌ర్ అని న‌మ్ముతుంటారు. ఇప్ప‌టివ‌ర‌కు చాలా మంది అభిమానులు ఇలాంటివి ఎదుర్కున్నారు. కొన్నిసార్లు వ్య‌తిరేక ప‌రంగా కూడా కొన్ని సెంటిమెంట్లు అనేవి ఉంటాయి. న‌టుల ప‌రంగానే కాకుండా అభిమానుల నుంచి కూడా వ‌స్తుంటాయి. త‌మ అభిమాన హీరోకి చెంద‌న సినిమా విడుదలైందంటే చాలు కొన్ని సెంటిమెంట్లు పాటిస్తుంటారు. ముఖ్యంగా సినిమాకు వెళ్ల‌డం కూడా ఓ సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. ప్ర‌తి విష‌యంలో సెంటిమెంట్ ఫాలో అయ్యే న‌టులు, అభిమానులు చాలా మందే ఉన్నారు. ద‌ర్శ‌కుల్లో చాలా మంది ద‌ర్శ‌కులు సెంటిమెంట్లు న‌మ్ముతారు. అందులో అగ్ర‌ద‌ర్శ‌కుడు, ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి మొద‌టి వ‌రుస‌లో ఉంటాడ‌నే చెప్ప‌వ‌చ్చు.

View this post on Instagram

Advertisement

A post shared by eematramhintisthechalu (@eematramhintisthechalu)

రాజ‌మౌళి సినిమాల్లో సెంటిమెంట్లు చాలానే ఉంటాయి. ఈయ‌న ఏదైనా సినిమా తీస్తే అందులో క‌చ్చితంగా ఏదైనా స‌న్నివేశంలో డైరెక్ట‌ర్ ఉండాల్సిందే. తొలుత రాజ‌మౌళి టాలీవుడ్ ఇండ‌స్ట్రీకే ప‌రిమిత‌మ‌య్యారు. ఇక ఆ త‌రువాత టాలీవుడ్‌లో కాకుండా బాలీవుడ్‌లో కూడా రాజ‌మౌళి సినిమాల‌కు క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా మ‌గ‌ధీర‌, బాహుబ‌లీ సినిమాల‌కు రాజ‌మౌళికి విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. ఇక ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు రాజ‌మౌళి.

 


ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని చూసి మిగ‌తా స్టార్ డైరెక్ట‌ర్లు కూడా పాన్ ఇండియా సినిమాల‌పై దృష్టి పెడుతున్నారు. ఇప్ప‌టికే చాలా మంది స్టార్ డైరెక్ట‌ర్లు పాన్ ఇండియా సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. అయిన‌ప్పటికీ రాజ‌మౌళి క్రేజ్‌ను మాత్రం అందుకోలేక‌పోతున్నారు. రాజ‌మౌలి తాను తీసిన ప్ర‌తి సినిమాలో ఒక డైరెక్ట‌ర్ ఉండాల‌ని సెంటిమెంట్ భావిస్తాడు. చాలా వ‌ర‌కు ఆయ‌న తీసిన సినిమాల్లో ఆయ‌న ఏదో ఒక స‌న్నివేశంలో క‌నిపిస్తుంటాడు. అలా ఇప్ప‌టికి నితిన్ న‌టించిన సై సినిమాలో, ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లిలో, ఇటీవ‌లే మ‌ల్టీస్టారర్ గా ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయ‌న క‌నిపించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా రాజ‌మౌళి త‌న సినిమాల్లో స్పెష‌ల్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్ష‌కుల‌ను స‌ర్‌ప్రైజ్ చేస్తుంటాడు.

Also Read : 

ఒకప్పటి తార సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం..! జీవితంలో అంతటి నరకాన్ని చూసిందో ఆమె మాటలలోనే..!

శేఖర్ మాస్టర్ కూతురు హీరోయిన్ అవ్వనుందా.. ఆ క్వాలిటీస్ ఉన్నా హీరో కోసం వెతుకుతున్నారా..?

 

Visitors Are Also Reading