దర్శకధీరుడు రాజమౌళి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం అభిమానులను సంపాదించుకున్నారు. ఇక రాజమౌళి ఒకే రకం సినిమాలు కాకుండా విభిన్నమైన చిత్రాలు చేసి అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. జక్కన్న నుండి వచ్చిన డిఫరెంట్ సినిమాలలో ఈగ సినిమా కూడా ఒకటి.
Advertisement
ఈ సినిమాలో నాని హీరోగా నటించగా సమంత హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా ఈ సినిమాలో నాని చనిపోయి ఆ తరవాత ఈగ గా మరో జన్మలో వచ్చి విలన్ ను హతమార్చడం ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో భారీ వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ తో జక్కన్న తన మార్క్ ను చూపించారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు జక్కన్న విజన్ చూసి ఆశ్చర్యపోయారు. అంతే కాకుడా నాని, సమంత ల అద్భుతమైన నటన కూడా ఈ సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి.
Advertisement
ఇక అప్పుడు పాన్ ఇండియా సినిమాలు లేవు గానీ ఉండి ఉంటే ఈ సినిమాకు కూడా అన్ని ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఫిదా అయ్యేవారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో జక్కన్న ఓ మిస్టేక్ చేసి నెటిజన్లకు దొరికిపోయాడు. దాంతో ఆ మిస్టేక్ ను గమనించిన నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో కొంచెం కొంచెం సాంగ్ అనేది ప్రేక్షకులకు తెగనచ్చేసింది.
అయితే ఈ సాంగ్ కంటే ముందు సమంత ఆఫీస్ నుండి బయటకు రాగా బైక్ లో పెట్రోల్ అయిపోతుంది. దాంతో బైక్ అక్కడే పార్క్ చేసి సమంత నానితో కలిసి ఇంటికి వెళుతుంది. రాత్రి పెట్రోల్ లేకపోవడంతో సమంత నడుచుకుంటూ వెళుతుంది. కానీ మరుసటిరోజు ఉదయం సమంత బైక్ ఫుల్ ట్యాంక్ చూపిస్తుంది. ఆ బైక్ వేసుకుని సమంత ఆఫీస్ కు వెళుతుంది. అసలు బైక్ ఎలా వచ్చింది జక్కన్నా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ALSO READ : ఆదిపురుష్ బాటలోనే సమంత నటించిన శాకుతలం..!