రీసెంట్ థియేటర్లలో విడుదలైన బింబిసార సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాతో కల్యాణ్ రామ్ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో వశిష్ఠ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. అంతే కాకుండా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ముందు నుండి ఈ సినిమా పై అనుమానాలు నెలకొన్నాయి.
Advertisement
సినిమా పోస్టర్, ట్రైలర్ లు చూసి సినిమాను తక్కువ అంచనా వేశారు. బాహుబలితో పోలుస్తూ ట్రోల్స్ చేశారు. కానీ సినిమా బాహుబలి రేంజ్ లో లేకపోయినా కూడా సూపర్ గా ఉందని సినిమా చూసిన తరవాత విశ్లేషకులు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాను రాజమౌళి కూడా థియేటర్ లలో చూశారు. ఇటీవలే జక్కన్న ఓ థియేటర్ లో ఈ సినిమాను వీక్షించారు.
Advertisement
అయితే సినిమా చూసిన తరవాత జక్కన్న ఆ సినిమా ఎలా ఉంది అనేది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అంతే కాకుండా ప్రస్తుతం థియేటర్ ల పరిస్థితి సరిగ్గాలేదు. కాబట్టి జనాలను రప్పించేందుకు జక్కన్న ఈ సినిమా పై సోషల్ మీడియాలో స్పందిస్తాడని అంతా అనుకున్నారు. కానీ జక్కన్న మాత్రం సినిమా చూసి సైలెంట్ గా ఉన్నారు. నందమూరి ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉండటం తో పాటూ కీరవాణి బింబిసారకు స్వరాలు సమకూర్చారు.
ఈ నేపథ్యంలోనే రాజమౌళి సినిమా చూశాడని అంతా అనుకుంటున్నారు. అయితే రాజమౌళి సినిమా చూసి కూడా స్పందిచకపోవడానికి ఓ రీజన్ ఉంది అనేది టాక్. అదేంటంటే…..బింబిసార తో పాటూ సీతారామం సినిమా కూడా ఒకే రోజు విడుదలైంది. కాబట్టి బింబిసారకు సపోర్ట్ చేస్తే సీతారామం కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. సీతారామం సినిమాకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దాంతో ఆ సినిమా నష్టపోకూడదనే జక్కన్న ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్.