Home » రాఘ‌వేంద్ర‌రావు కొడుకు కూడా హీరోగా సినిమాలు చేశాడ‌ని తెలుసా..? కానీ సినిమాల‌కు ఎందుకు గుడ్ బై చెప్పాడంటే..?

రాఘ‌వేంద్ర‌రావు కొడుకు కూడా హీరోగా సినిమాలు చేశాడ‌ని తెలుసా..? కానీ సినిమాల‌కు ఎందుకు గుడ్ బై చెప్పాడంటే..?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలోకి హీరోల కొడుకులు నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వ‌డం చాలా కామ‌న్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కూ అలా చాలా మంది వార‌సులు ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ అయ్యారు. అంతే కాకుండా చాలా మంది వార‌సులు ఎంట్రీ ఇచ్చినప్ప‌టికీ సక్సెస్ అవ్వ‌లేక వెన‌క‌డుగు వేశారు. అయితే ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అవ్వాలంటే టాలెంట్ తో పాటూ అదృష్టం కూడా త‌ప్ప‌ని సరి ఈ రెండింటిలో ఏ ఒక్క‌టి లేక‌పోయినా హీరోగా స‌క్సెస్ అవ్వ‌డం అంత సులువైన విష‌యం కాదు.

Advertisement

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో కొంత‌మంది ప‌లుకుబడి ఉన్న‌వాళ్ల కుమారులు ఎంట్రీ ఇచ్చారు కానీ చాలా మందికి ఆ విష‌యం తెలియ‌దు. ఆ లిస్ట్ లో ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కుమారుడు కూడా ఉంటాడు. రాఘ‌వేంద్ర‌రావు ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించి స్టార్ డైరెక్ట‌ర్ గా ఎదిగారు. స్టార్ హీరోలు రాఘ‌వేంద్ర‌రావు తో సినిమాలు చేసేందుకు క్యూలో నిల‌బ‌డేవారు.

Advertisement

చిరంజీవి, వెంక‌టేష్, శ్రీకాంత్ ఇలా ప్ర‌తి ఒక్క‌రికీ ద‌ర్శ‌కేంద్రుడు హిట్స్ ఇచ్చాడు. కానీ రాఘ‌వేంద్ర‌రావు సొంత కుమారుడు మాత్రం హీరోగా స‌క్సెస్ అవ్వ‌లేక‌పోయాడు. ఆ వివ‌రాలు ఇప్పుడు చూద్దాం….రాఘ‌వేంద్ర‌రావు కుమారుడి పేరు ప్ర‌కాష్ కోవెల‌మూడి ….కాగా నీతో అనే సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమాకు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ జాన్ మ‌హేంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఆ త‌ర‌వాత వ్యక్తిగ‌త కార‌ణాల వ‌ల్ల మ‌ళ్లీ హీరోగా ట్రై చేయ‌లేదు. కానీ ప్ర‌కాష్ ద‌ర్శ‌కుడిగా మారి బొమ్మ‌లాట‌, అన‌గ‌న‌గా ఓ ధీరుడు సినిమాల‌లో న‌టించాడు. ఈ సినిమాలు హిట్ అవ్వక‌పోవ‌డంతో ఇక ద‌ర్శ‌క‌త్వం కు కూడా స్వ‌స్తి ప‌లికాడు. ఆ త‌ర‌వాత ప్రకాష్ త‌మ వ్యాపారాలు చూసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading