Home » రాధేశ్యామ్ వాయిదా.?..డైరెక్ట‌ర్ ట్వీట్ వైరల్..!

రాధేశ్యామ్ వాయిదా.?..డైరెక్ట‌ర్ ట్వీట్ వైరల్..!

by AJAY
Ad

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న మ‌ళ్లీ మొద‌లైంది. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో థియేట‌ర్లు పూర్తిగా మూత‌ప‌డ్డాయి. ఆ త‌ర‌వాత మ‌ళ్లి థియేట‌ర్లు తెరుచుకునేందుకు చాలా స‌మ‌యం ప‌ట్టింది. మ‌ళ్లీ సెకండ్ వేవ్ వ‌చ్చింది ఆ స‌మ‌యంలోనూ సేమ్ సీన్ క‌నిపించింది. అఖండ‌తో మ‌ళ్లీ ఆశ‌లు మొల‌య్యాయి. కానీ ఇప్పుడు థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. ఇప్ప‌టికే పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేసులు పెర‌గ‌టంతో ఉత్త‌రాదిన సినిమా థియేటర్ల పై ఆంక్ష‌లు పెరిగాయి. ఢిల్లీలో పూర్తిగా థియేట‌ర్ల‌ను మూసివేశారు.

radhe shyam

radhe shyam

హ‌ర్యానా, ముంబై తో పాటు మ‌రికొన్ని రాష్ట్రాల్లో 50శాతం సీటింగ్ ప‌రిమితులు అమ‌లు చేశారు. ఇక ద‌క్షిణాదిన కూడా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దాంతో ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల‌ను వాయిదా వేసుకుంది. ఇక రాధే శ్యామ్ మాత్రం పండ‌గ‌కు వ‌స్తుంద‌ని అంతా ఆశించారు. కానీ ఇప్పుడు ఆ ఆశ‌లు కూడా ఆవిరైన‌ట్టే అనిపిస్తున్నాయి. రాధే శ్యామ్ కూడా విడుద‌ల వాయిదా ప‌డబోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ వార్త‌ల‌కు బ‌లం చేకూరేలా రాధేశ్యామ్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ చేసిన ట్వీట్ క‌నిపిస్తోంది.

Advertisement

Advertisement

also read : సినిమాకే హైలెట్ నిలిచిన ఈ 10 పాత్రలను రిజెక్ట్ చేసిన నటీనటులు ఎవరో తెలుసా….?

రాధా కృష్ణ తాజాగా చేసిన ట్వీట్ లో “సమయం కఠినంగా ఉంది.. హృద‌యాలు బ‌ల‌హీనంగా ఉన్నాయి. మ‌న‌సులు అల్ల‌క‌ల్లోలంగా ఉన్నాయి. జీవితం మ‌న మీద‌కు ఏది విసిరినా మ‌న ఆశ‌లు గొప్ప‌గా ఉంటాయి. అంద‌రూ సుర‌క్షితంగా ఉండండి..” అంటూ పేర్కొన్నారు. దాంతో ఫ్యాన్స్ ధైర్యంగా సుర‌క్షితంగా ఉండాల‌ని ద‌ర్శ‌కుడు హింట్ ఇచ్చిన‌ట్టుగా క‌నిపిస్తోంది. అంతే కాకుండా వీలైనంత త్వ‌ర‌గా అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రాబోతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

Visitors Are Also Reading