Home » ‘బాహుబలి’ రేంజ్ లో ‘పుష్ప’ ప్రీ రిలీజ్ బిజినెస్

‘బాహుబలి’ రేంజ్ లో ‘పుష్ప’ ప్రీ రిలీజ్ బిజినెస్

by Bunty
Ad

2021 సంవత్సరంలో అత్యంత అంచనాలున్న సినిమాల్లో ఒకటి అల్లు అర్జున్ నటించిన “పుష్ప: ది రైజ్”. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2021 డిసెంబర్ 17న పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా అన్ని భాషల థియేట్రికల్ హక్కులు ఇప్పటికే ఫ్యాన్సీ ధరకు అమ్ముడు అయ్యాయి. ఒక అగ్ర ఓటిటి సంస్థ ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం భారీ మొత్తంలో డబ్బు చెల్లించారు. ఆడియో, శాటిలైట్ హక్కుల డీల్‌లు మాత్రమే భారీ ధరకు సొంతం చేసుకున్నారు. “పుష్ప” ఓవరాల్ రైట్స్ మొత్తం రూ. 250 కోట్లు అని టాక్. అది ‘బాహుబలి’ స్థాయి అని చెప్పొచ్చు. ‘పుష్ప’ మొదటి భాగం విడుదలకు ముందే ఇలా భారీ సంఖ్యలో రైట్స్ అమ్ముడవ్వడం విశేషం.

Advertisement

Advertisement

‘పుష్ప’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇది అల్లు అర్జున్ యొక్క మొదటి పాన్-ఇండియా చిత్రం. విపరీతమైన అంచనాలను కలిగి ఉన్న ఈ చిత్రం కొన్ని రోజుల్లో విడుదలై థియేటర్లలో ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో పాటు సమంతా ప్రభు కలిసి స్టెప్పులేసి “ఊ అంటావా మావా ఉఊ అంటావా” అనే ఐటెం సాంగ్‌ సంచలనం సృష్టిస్తోంది.  మరోవైపు ఈ సాంగ్ లిరిక్స్ అభ్యంతరకరంగా ఉన్నాయి అంటూ వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే.

Visitors Are Also Reading