Home » Puri Jagannadh:ఛార్మితో తిరిగి తప్పు చేశా..మళ్లీ ఫ్యామిలీతో కలిసిన పూరి..!!

Puri Jagannadh:ఛార్మితో తిరిగి తప్పు చేశా..మళ్లీ ఫ్యామిలీతో కలిసిన పూరి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా ఒక చెరువులో కానీ నదిలో కానీ పాత నీరు బయటకు వెళ్లినా కొద్దీ కొత్త నీరు వచ్చి కలుస్తూనే ఉంటుంది. ఆ విధంగానే ఏ ఇండస్ట్రీలో అయినా నటీనటులు డైరెక్టర్లు కూడా పాతబడిన కొద్ది కొత్తవారు వస్తూనే ఉంటారు. ఆ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా ఉన్న పూరి జగన్నాథ్ అంటే తెలియని వారు ఉండరు. ఆయన సినిమాలతో ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చారు. స్టార్ డైరెక్టర్గా ఎదిగారు. డిఫరెంట్ స్టైల్లో సినిమాలు తీయడం అంటే తెలుగు ఇండస్ట్రీలో పూరిని మించిన వారు లేరు. రాంగోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ గా చేసిన పూరి పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక రవితేజ హీరోగా ఇడియట్,అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వంటి సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టడంతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారారు.

also read:రషీద్ ఖాన్ విధ్వంసం.. అయినా ముంబైదే పై చేయి..!

Advertisement

ఆయన ప్రభాస్,అల్లు అర్జున్,మహేష్,రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ ల కెరియర్లో బెస్ట్ సినిమాలను అందించారని చెప్పవచ్చు. ఇక మహేష్ బాబుతో తీసిన బిజినెస్ మ్యాన్, జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ మినహా గత పది సంవత్సరాల నుంచి హిట్ లేని పూరికి రామ్ పోతినేని కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఒక హిట్ ఇచ్చింది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ చార్మి. 2017లో విడుదలైన జ్యోతిలక్ష్మి సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన చార్మి పూరితో కలిసి చాలా సినిమాలు నిర్మించారు. ఇందులో ఇస్మార్ట్ శంకర్ తప్ప అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కట్ చేస్తే పూరి జగన్నాథది ప్రేమ వివాహం. తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే సమయంలోనే లావణ్య గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఆకాష్, పవిత్ర అనే ఇద్దరు పిల్లలు.

Advertisement

also read:తెలుగులో అక్కినేనికి తొలి ద్విపాత్రాభినయం సినిమా ఏదో తెలుసా ? 

అయితే గత కొంతకాలం నుంచి చార్మి,పూరి సహజీవనం చేస్తున్నారని వార్తలు అనేకం వచ్చాయి. ఈ విషయంలో చార్మిని అడిగితే ఫ్రెండ్ మాత్రమే అని చెప్పింది. అలాగే పూరి జగన్నాథ్ ని అడిగితే నాకు కష్టాల్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసింది అంటూ తెలిపారు. అంతకుమించి మా మధ్య ఏం లేదన్నారు. అయితే వీరి కలయికలో వచ్చిన చివరి సినిమా లైగర్. ఇది డిజాస్టర్ కావడంతో విజయ్ తో తాను అనుకున్న జనగణమన సినిమా కూడా ఆగిపోయింది. అయితే గత కొంతకాలంగా చార్మి, పూరి ఒక దగ్గరే ఉంటున్నారని, పూరి తన కుటుంబాన్ని వదిలేసాడని అనేక వార్తలు వచాయి. వీటన్నింటికీ తెరపడేలా పూరి తన ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ వెళ్లారు. దీంతో చార్మి పూరి మధ్య ఉన్న వ్యవహారం గురించి పులిస్టాప్ పడినట్టుంది.

also read:అందాల తార మాధవి మీకు గుర్తుందా..? ఆమె కూతుర్లు తల్లిని మించిపోయారుగా..!

Visitors Are Also Reading