Home » పూరి జగన్నాథ్ తమ్ముడు ఎమ్మెల్యే అనే విషయం మీకు తెలుసా ?

పూరి జగన్నాథ్ తమ్ముడు ఎమ్మెల్యే అనే విషయం మీకు తెలుసా ?

by Bunty
Ad

టాలీవుడ్ దర్శకులలో పూరి జగన్నాథ్ కు ప్రత్యేకత ఉంది. ఆయన ప్రతి సినిమా… చాలా మాస్ గా ఉండడమే కాకుండా… అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే అతి తక్కువ కాలంలోనే ఒక సినిమా తీయగల సత్తా పూరి జగన్నాథ్ కు మాత్రమే ఉంది. ఇప్పటికే చిత్ర పరిశ్రమంలో చాలా మంది స్టార్ హీరోలతో చేసిన పూరి జగన్నాథ్.. ఈమధ్య కాలంలో హిట్ లేక సతమౌతమవుతున్నాడు.

Advertisement

గతంలో రవితేజతో… ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలాంటి మంచి సినిమాలు చేసిన పూరి జగన్నాథ్… మహేష్ బాబుకు బిజినెస్ మాన్, పోకిరి లాంటి హిట్లను అందించాడు. అలాగే.. జూనియర్ ఎన్టీఆర్కు టెంపర్ సినిమాతో మంచి బూస్ట్ ఇచ్చారు పూరి జగన్నాథ్. ఇటు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందించారు పూరి జగన్నాథ్. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా లెగర్ సినిమాను చేసిన పూరి జగన్నాథ్… తీవ్రంగా నష్టపోయారు. ఇది ఇలా ఉండగా తాజాగా పూరి జగన్నాథ్ ఫ్యామిలీ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

పూరి జగన్నాథ్ కు ఒక తమ్ముడు ఉన్నాడని అందరికీ తెలిసిందే. అతను పేరు సాయి రాం శంకర్. ఈ సాయిరాం శంకర్ ఇప్పటికే పలు సినిమాలలో హీరోగా నటించాడు. అయితే సాయిరాం తో పాటు పూరి జగన్నాథ్ కు పెట్ల ఉమాశంకర్ గణేష్ అనే మరో తమ్ముడు కూడా ఉన్నాడట. ఉమాశంకర్ ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నారని వెలుగులోకి వచ్చింది. ఉమాశంకర్ ఇప్పుడు నర్సీపట్నం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారట. మొదట టిడిపిలో ఉన్న ఉమాశంకర్… 2014 ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019లో మరోసారి పోటీ చేసి వైసిపి ఎమ్మెల్యేగా భారీ విజయం అందుకున్నారు. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

వెస్టిండీస్ టూర్ కు టీమిండియా టెస్టు, వన్డే జట్ల ఎంపిక.. రహానేకు కీలక బాధ్యతలు

Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు

అత్త చేతిలో ధోని వ్యాపారం..ఏకంగా రూ.800 కోట్లు !

Visitors Are Also Reading