Home » లైగర్ నష్టాలను తీర్చనున్న పూరీ..?

లైగర్ నష్టాలను తీర్చనున్న పూరీ..?

by Azhar
Ad

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒక్కడైనా పూరీ జగన్నాథ్ నుండి గత నెల 25న వచ్చిన సినిమా లైగర్. ఇందులో హీరో, హీరోయిన్స్ గా విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించారు. ఇక విజయ్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ లైగర్ పూర్తిగా డిజాస్టర్ గా మిగిలిపోయిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు ఏవి ఉన్నాయి.

Advertisement

ఇంకా మైక్ టైసన్ కూడా లైగర్ లో ఉండటంతో దీనిపైన అంచనాలు అనేవి బాగా పెరిగాయి. ఇక లైగర్ ప్రమోషన్స్ కూడా మంచి రెస్పాన్స్ రావడంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరకు ఈ సినిమాను తీసుకున్నారు. కానీ లైగర్ విడుదలైన మొదటిరోజే ఈ సినిమా పెద్ద ప్లాప్ అని తేలడంతో.. డిస్ట్రిబ్యూటర్లు బాగా నష్టపోయినట్లు తెలుస్తుంది. అందువల్ల తమ నష్టం తీర్చాలని తెలుగు రాష్టాల్లోని డిస్ట్రిబ్యూటర్లు పూరీ అలాగే ఛార్మి పైన ఒత్తిడి అనేది పెంచారు.

Advertisement

అలాగే తమ నష్టం తీర్చకుండా ఇంకో సినిమా ప్రారంభించవద్దు అని ఫిల్మ్ ఛాంబర్ కు కూడా వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే లైగర్ నష్టాలను పూడ్చడానికి డైరెక్టర్ పూరీ ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే మొత్తం కాకపోయినా నష్టంలో కొంత భాగంగా 13 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వడానికి పూరీ సిద్ధమయ్యాడు అని సమాచారం. ఇందులో ఏరియాల వారిగా ఆంధ్రకు 6 కోట్లు, నైజాం 4.5 కోట్లు, సీడెడ్ 2.25 కోట్లు ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

పాక్ సెలక్షన్ పై విమర్శలు..!

ఆర్‌సీబీ వల్లే నేను ఈ ఘనత సాధించాను..!

Visitors Are Also Reading