Home » విజయ్ ని తెలివిగా బుక్ చేసిన పూరీ..?

విజయ్ ని తెలివిగా బుక్ చేసిన పూరీ..?

by Azhar
Ad
విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో తన మొదటి పాన్ ఇండియా ఎంట్రీ అనేది అనేది ఇచ్చాడు. అయితే ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన విషయ తెలిసిందే. ఇక పూరీ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ అనే మాట వినగానే అందరూ ఎన్నో అంచనాలను ఏర్పరుచుకున్నారు. కానీ ఈ సినిమా అనేది ఇప్పుడు విడుదల అయ్యి డిజాస్టర్ గా నిలిచింది.
అయితే ఈ లైగర్ సినిమాను మొత్తం 90 కోట్లు పెట్టి తీయగా 30 కోట్లు కూడా వచ్చేలా కనిపించడం లేదు అని తెలుస్తుంది. పూర్తిగా బాలీవుడ్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని పూరీ ఈ సినిమాను తెరకెక్కించగా.. సౌత్ లో ఎలాగూ ప్లాప్ అయ్యింది. కానీ నార్త్ లో కూడా దీనికి నెగెటివ్ టాక్ మాత్రమే వచ్చింది. అయితే ఈ సినిమా అనేది క్లోప్ కాబోతుంది అని పూరీకీ ముందే అర్ధం అయ్యిందట.
అందుకే విజయ్ ను తెలివిగా రెండో సినిమాకు బుక్ చేసాడు అని అంటున్నారు జనాలు. అయితే ఈ లైగర్ సినిమా అనేది విడుదల కాకముందే విజయ్, పూరీ కాంబినేషన్ లో జనగణమన అనే సినిమా రాబోతున్నట్లు ప్రకటించారు. కానీ లైగర్ ప్లాప్ అవుతుంది అని అర్ధం అయ్యిన తర్వాత జనగణమన సినిమా మిస్ కాకూడదు అని పూరీ ఆ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ అనేది పూర్తి చేసినట్లు కామెంట్స్ వస్తున్నాయి.

Advertisement

Visitors Are Also Reading