Home » మహేష్ బాబుతో పూరీ ఆ రెండు సినిమాల సీక్వెల్..?

మహేష్ బాబుతో పూరీ ఆ రెండు సినిమాల సీక్వెల్..?

by Azhar
Ad
దర్శకుడు పూరీ జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్ డెడ్లి కాంబినేషన్ అనేది అందరికి తెలిసిందే. ఇప్పటివరకు వీరి కాంబినేషన్ లో వచ్చినవి రెండు సినిమాలే.. కానీ ఆ రెండు సినిమాలు మొత్తం టాలీవుడ్ ను షేక్ చేసాయి. అందులో మొదటి సినిమా పోకిరి కాగా.. రెండవ సినిమా బిజినెస్ మ్యాన్. ఈ రెండు సినిమాలు మహేష్ బాబు కెరియర్ లో చాలా మార్పులు తెచ్చాయి.
దాంతో ఈ సినిమాలకు సీక్వెల్ అనేది వస్తే బాగుంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. ఇక తాజాగా ఈ విషయంపై పూరీ నోరు విప్పాడు. అయితే ఇప్పుడు పూరీ డైరెక్ట్ చేసిన లైగర్ అనే సినిమా ఈరోజు విడుదల అయ్యింది. ఇక దీని ప్రమోషన్స్ లోనే ఉరి మాట్లాడుతూ.. నాకు బిజినెస్ మ్యాన్ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనీ ఉంది అంటూ కామెంట్స్ చేసాడు. అలాగే దీని సీక్వెల్ గురించి కూడా చెప్పాడు.
నేను పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాల సీక్వెల్ అనేది చేయాలనీ అనుకున్నాను. కానీ అది కుదరలేదు. ఒకవేళ అన్ని కుదిరితే మాత్రం తప్పకుండ ఈ రెండు సినిమాలకు సీక్వెల్ అనేది తీస్తా అని పూరీ చెప్పాడు. అయితే ఇందులో హీరోగా మహేష్ బాబే ఉంటాడా… లేదా మరో హీరో ఎవరైనా ఉంటారా అనేది తెలియదు. ఎందుకంటే.. ఈ మధ్యే మహేష్ కు పూరీకి మధ్య దూరం అనేది పెరిగిన విషయం అందరికి తెలిసిందే.

Advertisement

Visitors Are Also Reading