Home » మొన్న చంపేశారు…ఇప్పుడు గ‌ర్భ‌వ‌తిని చేశారు…వారిపై పున‌ర్న‌వి ఫైర్..!

మొన్న చంపేశారు…ఇప్పుడు గ‌ర్భ‌వ‌తిని చేశారు…వారిపై పున‌ర్న‌వి ఫైర్..!

by AJAY
Ad

పున‌ర్న‌వి భూపాలం ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటున్నా టాలీవుడ్ లో ఆమెకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఉయ్యాల జంపాల సినిమాతో పున‌ర్న‌వి టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యింది. సినిమాలో పున‌ర్న‌వి హీరోయిన్ స్నేహితురాలి పాత్ర చేసింది కానీ ప్రేక్షకులు మాత్రం ఆమె అందానికి ఫిదా అయ్యారు.

బేసిక్ గా తెలుగు అమ్మాయి అయిన పున‌ర్న‌వి ఆ త‌ర‌వాత చాలా సినిమాల‌లో న‌టించింది. పిట్ట‌గోడ సినిమాలో పున‌ర్న‌వి హీరోయిన్ గా న‌టించింది. అంతే కాకుండా సినిమాల‌తో గుర్తింపు సంపాదించుకున్న త‌ర‌వాత బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టింది. బిగ్ బాస్ లో త‌న యాటిట్యూడ్ మ‌రియు రాహుల్ సిప్లింగ‌జ్ తో ప్రేమాయ‌ణంతో వార్త‌ల్లో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Advertisement

ఆ త‌ర‌వాత ప‌లు టీవీ షోల‌లో క‌నిపించి పున‌ర్న‌వి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. అయితే స‌డ‌న్ గా పున‌ర్న‌వి సినిమాల‌కు టీవీ షోల‌కు దూరం అయిన సంగ‌తి తెలిసిందే. కాగా విదేశాల్లో చ‌దువుకునేందుకు పున‌ర్న‌వి సినిమాల‌కు గ్యాప్ ఇచ్చింది. కానీ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గానే ఉంటోంది. అయితే విదేశాల్లో ఉంటున్న స‌మ‌యంలో త‌న గే బెస్టీతో క‌లిసి దిగిన ఫోటోల‌ను షేర్ చేసింది.

 

అయితే పున‌ర్న‌వి గ‌ర్భ‌వ‌తి అని త‌న బెస్టీ వ‌ల్ల‌నే గ‌ర్భ‌వతి అయ్యింద‌ని ప్రచారం మొద‌ల‌య్యింది. అంతే కాకుండా ఇటీవల పున‌ర్న‌వి అనారోగ్యం భారినప‌డ‌గా ఆమె చ‌నిపోయిందంటూ కూడా ప్రచారం మొద‌లు పెట్టారు. కాగా ఆ వార్త‌ల‌పై తాజాగా పున‌ర్న‌వి సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి స్పందించింది. పుకార్లు పూర్తిగా అర్థం లేనివి నా గే బెస్టీతో న‌న్ను గ‌ర్భ‌వ‌తిని చేస్తూ సోష‌ల్ మీడియా నిర్న‌యించింది. గ‌త నెల‌లో నేను చ‌నిపోతున్నా అని రాశారు ఈ నెల‌లో నేను ప్రెగ్నెంట్ అని రాశారు. అస‌లు యూట్యూబ్ మిత్రుల‌కు మా స్నేహం గురించి ఏం అర్థం అయ్యింది. అంటూ పున్ను త‌న పోస్ట్ లో పేర్కొంది.

Visitors Are Also Reading