పవిత్రా లోకేష్ ప్రస్తుతం తరచూ మీడియాలో వినిపిస్తున్న పేరు. నిజానికి పవిత్రాలోకేష్ కన్నడ పరిశ్రమకు చెందిన నటి. అక్కడ పవిత్రా లోకేష్ హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది. కానీ హీరోల కంటే ఎక్కువగా ఎత్తు ఉండటంతో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేక స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగలేకపోయింది. ఇక ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కన్నడ, తమిళ చిత్రాలతో పాటూ తెలుగు సినిమాల్లోనూ నటించింది.
Advertisement
అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం తెలుగు ప్రేక్షకులను పవిత్రా లోకేష్ ఆకట్టుకుంది. స్టార్ హీరోల సినిమాలలో వరుస ఆఫర్ లు దక్కించుకుంటూ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గా వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో మహేశ్ బాబుకు తల్లిగా నటించింది కూడా. ఇదిలా ఉంటే పవిత్ర లోకేష్ మరియు నటుడు నరేష్ సహజీవివనం చేస్తున్నారని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
Advertisement
మరోవైపు వీరిద్దరూ మైసూర్ లోని ఓ హోటల్ ఉండగా నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దాడి చేసేందుకు ప్రయత్నించారు. దాంతో నరేష్ పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ సంచలనంగా మారిపోయింది. ఈ వివాదంతో అటు నరేష్ ఇటు పవిత్ర లోకేష్ ల ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది.
ఇలా జరగటంతో ఆమె సైన్ చేసిన సినిమాల మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె నటిస్తున్న రెండు భారీ బడ్జెట్ చిత్రాల నుండి కూడా తొలగించారని టాక్ వినిపిస్తోంది. దాంతో ఆమె కెరీర్ పతనం అవుతుందని కూడా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.