Home » పృథ్వి కూతురు హీరోయిన్ గా ఎంట్రీ.. మా నాన్నలో ఆ ఒక్కటి నచ్చదు అంటూ షాకింగ్ కామెంట్స్..!!

పృథ్వి కూతురు హీరోయిన్ గా ఎంట్రీ.. మా నాన్నలో ఆ ఒక్కటి నచ్చదు అంటూ షాకింగ్ కామెంట్స్..!!

Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ పృథ్వి అంటే ఎవరికి తెలియదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే అందరికీ గుర్తుకు వస్తాడు పృథ్వి. ఆయన ఇప్పటికి ఎన్నో సినిమాల్లో చేసిన కామెడీ రోల్స్ మనందరినీ ఎంతగానో నవ్విస్తాయి. పృధ్వి నటుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల టైం లో పృథ్వి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి పెద్ద హంగామనే చేశారు. ప్రచారం కోసం రాష్ట్రం మొత్తం తిరిగాడు. దీని ఫలితంగా జగన్ సీఎం అయిన తర్వాత పృథ్వికి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు.

also read:బాలకృష్ణ కంటే పెద్ద స్టార్ అవ్వాల్సిన..ఈ నందమూరి హీరోను వెన్నుపోటు పొడిచింది ఎవరంటే..?

Advertisement

కానీ ఆయన ఒక మహిళతో జరిపిన ఫోన్ సంభాషణ లీక్ అవ్వడంతో ఆ పదవిని కోల్పోయాడు. ఆ తర్వాత జనసేన పార్టీకి మద్దతుదారుడిగా మారాడు. అలా రాజకీయాల్లో రాణిస్తూనే మంచి క్యారెక్టర్ ఉంటే సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం పృద్వి డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్నాడు. హీరో క్రాంతి ప్రధాన పాత్రలో పృథ్వి కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాను చేయబోతున్నారు. ఇందులో తన కుమార్తె శ్రీలూ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తండ్రి గురించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది.

Advertisement

also read:మరో మెగా హీరోకు 100 కోట్ల క్లబ్ లో చోటు..ఎవరంటే..?

మా నాన్న ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడని నాకు తెలియదు. ముందుగా హీరో క్రాంతిని సెలెక్ట్ చేసి ఆ తర్వాతే నన్ను ఎంపిక చేశారు. తన కుమార్తెగా నాకు అవకాశం ఇవ్వలేదు.. ఆ పాత్రకు నేను సరిపోతానని నమ్మకం కుదిరిన తర్వాతే నన్ను తీసుకున్నారు. నటుడిగా నాన్నని ఎంతో ఇష్టపడతా..కానీ నాన్న చేసే రాజకీయాలు నాకు నచ్చవు. కానీ వద్దని చెప్పలేను. ఎందుకంటే ఆయనకు పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం అంటూ శ్రీలూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

also read:ది కేరళ స్టోరీ సినిమా పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్…!!

Visitors Are Also Reading