Home » ఈ సారి మార్చి 10నే హోళి సంబురాలు : ప్ర‌ధాని మోడీ

ఈ సారి మార్చి 10నే హోళి సంబురాలు : ప్ర‌ధాని మోడీ

by Anji
Ad

ఐదు రాష్ట్రాల‌కు జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నాలుగు రాష్ట్రాల‌లో బీజేపీ జ‌య‌కేతం ఎగుర‌వేయ‌డంపై సంతోషం వ్య‌క్తం చేసారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాల‌యంలో కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ గెలుపును ప్ర‌జ‌ల విజ‌యంగా అభివ‌ర్ణించారు. అభివృద్ధికే ప్ర‌జ‌లు ప‌ట్టంగట్టార‌ని పేర్కొన్నారు. ఈ ఫ‌లితాల్లో దేశానికి గొప్ప సందేశం ఉంద‌ని పేర్కొన్నారు. బీజేపీ విజ‌యానికి కృషి చేసిన ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

Advertisement


ఈ ఉత్సాహం భార‌త ప్ర‌జాస్వామిక ఉత్స‌వం. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో గొప్ప సందేశముంది. ఈసారి హోలీ పండుగ మార్చి 10నే ప్రారంభ‌మైంది. ప్ర‌జ‌ల హృద‌యాలు చూర‌గొనేందుకు కార్య‌క‌ర్త‌లు ఎంతో శ్ర‌మించారు. దేశానికి ఎంద‌రో ప్ర‌ధాన‌మంత్రుల‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఇచ్చింది. 37 ఏళ్ల త‌రువాత యూపీలో ఓ పార్టీ రెండ‌వ‌సారి అధికారంలోకి వ‌చ్చింది. ఉత్త‌ర‌ఖండ్‌, గోవా, మ‌ణిపూర్‌లో మా బ‌లం మ‌రింత పెరిగింది. మాపై న‌మ్మకం ఉంచిన మాతృమూర్తులు, సోద‌రీమ‌ణుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Advertisement

Visitors Are Also Reading