Home » లీకుల బెడదతో ప్రశాంత్ నీల్ కఠిన నిర్ణయం..!

లీకుల బెడదతో ప్రశాంత్ నీల్ కఠిన నిర్ణయం..!

by Azhar
Ad
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు అనేది తెచ్చుకున్నా విషయం తెలిసిందే. సౌత్ నుండి రాజమౌళి తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ నిలిచాడు. ఇక ఈ ఏడాది కెజిఎఫ్ తోక సీక్వెల్ కూడా విడుదల అయ్యి.. 1200 కోట్ల కంటే ఎక్కువ వసూల్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఈ సీక్వెల్ అనేది విడుదల కాకముందే ప్రశాంత్ నీల్ తంతా కొత్త సినిమా ప్రకటించాడు.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ తో ప్రస్తుతం సినిమా అనేది చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా సాలార్ అనే పేరుతో పాన్ ఇండియా సినిమాగా వస్తుంది. అయితే ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు అనేవి. కానీ భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను లీకుల బెడద అనేది వెంటాడుతుంది.
ఈ సినిమా నుండి ఇప్పటికే చాలా ఫోటోలు అనేవి లీక్ అయ్యాయి. తాజాగా ప్రభాస్ యొక్క స్టీల్ కూడా బయటకు వచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్ నీల్.. చిత్రబృందం పైన చాలా సీరియస్ అయ్యినట్లు తెలుస్తుంది. ఇక ముందు ముందు ఇలా కాకుండా ఆయన ఓ సంచనల నిర్ణయం అనేది తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేంటంటే.. ఇక నుండి ఎవరైనా సరే సెట్స్ లోకి వచ్చేముందు తన ఫోనును బయటే పెట్టాలి అని అందరికి ప్రశాంత్ నీల్ సూచించినట్లు సమాచారం.

Advertisement

Visitors Are Also Reading