Home » మరోసారి మిర్చి కాంబోలో సినిమా…?

మరోసారి మిర్చి కాంబోలో సినిమా…?

by Azhar
Ad
సినిమా ఇండస్ట్రీలలో ఇప్పుడు కొన్ని కాంబోలు అనేవి జనాలకు బాగా నచ్చేస్తాయి. అది హీరో హీరోయిన్ కావచ్చు లేదా హీరో డైరెక్టర్ కూడా కావచ్చు. కానీ వారి కాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. అలాంటిదే మిర్చి సినిమా కాంబో.  కొరటాల శివ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్. కానీ ఆయన దర్శకునిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది మాత్రం మిర్చి సినిమాతోనే. ఇందులో ప్రభాస్, అనుష్క జంటగా నటించారు. అయితే మాస్, యాక్షన్ సెంటిమెంట్ అన్ని కలిపి సినిమా తీయడంలో కొరటాల దిట్ట అనే చెప్పాలి. ఈ సినిమాలో కూడా అలానే చేసారు.
కానీ ప్రభాస్, కొరటాల కాంబోలో మరో సినిమా వస్తే బాగుటుంది అని ఫ్యాన్స్ అనుకున్నారు. అది కుదరలేదు. అయితే మిర్చి తర్వాత ప్రభాస్ బాహుబలి సినిమా మొదలు పెట్టాడు. అలాగే కొరటాల కూడా మహేష్ తో శ్రీమంతుడు, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిస్తా కొట్టాడు. ఇక ఈ మధ్య చిరంజీవి, రామ్ చరణ్ తో కొరటాల శివ తీసిన ఆచార్య అనే సినిమా ప్లాప్ అయ్యింది. అయిన కూడా వెన్నకి తగ్గని కొరటాల ఇప్పుడు ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పైనే కొరటాల మొత్తం ఫోకస్ పెట్టాడు అని తెలుస్తుంది.
ఇక ఇదే సమయంలో మరోసారి మిర్చి కాంబోలో సినిమా రాబోతుంది అని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న ప్రభాస్ కు కొరటాల తాజాగా ఓ కథ చెప్పాడట. ఇక ఆ స్టోరీ నచ్చడంతో ప్రభాస్ కూడా ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ప్రభాస్ ముందు చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి. కాబట్టి ఆ సినిమాలు అన్ని పూర్తయిన తర్వాతే ప్రభాస్ కొరటాలతో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో కొరటాల కూడా ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ తో సినిమా పూర్తి చేయాలనీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఈ మరోసారి మిర్చి కాంబోలో సినిమా ఇప్పుడు ఫ్యాన్స్ ముందుకు వస్తుంది అనేది.

Advertisement

Visitors Are Also Reading