Home » అంత బాధలో ఉన్న ఫ్యాన్స్ గురించి ఆలోచించిన ప్రభాస్.. ఎంతైనా ప్రభాస్ లెక్కే వేరప్పా..!!

అంత బాధలో ఉన్న ఫ్యాన్స్ గురించి ఆలోచించిన ప్రభాస్.. ఎంతైనా ప్రభాస్ లెక్కే వేరప్పా..!!

by Sravanthi Pandrala Pandrala

రాజవంశీయుల కుటుంబానికి చెందిన ప్రభాస్ ఇండస్ట్రీలోకి రాకముందే ఎంతో సంపన్నమైన కుటుంబం.. ఆయన సినిమాల్లోకి రావడానికి అంతగా ఇబ్బంది ఏమీ పడలేదు .. కానీ ఇండస్ట్రీలో కి వచ్చిన కొంత కాలంలోనే ఎనలేని అభిమానులను సంపాదించుకున్నారు. అంతా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ప్రభాస్ మాత్రం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆలోచన కలిగిన హీరో. ప్రభాస్ తన జీవితంలో తన ఫ్యాన్స్ కి ఎంత గౌరవం ఇస్తారో మన అందరికీ తెలుసు. కంటికి రెప్పలా అభిమానులు చూసుకుంటూ ఉంటారు.. అలాంటి ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే..

also read:మీ కంటి చూపు మంద‌గిస్తుందా..? భోజ‌నం చేసిన త‌రువాత ఈ ప‌నులు త‌ప్ప‌క చేయండి..!

అయితే ఈ మధ్య ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు అనారోగ్య సమస్యలతో మృతిచెందారు. ఆయనను కడసారి చూసుకునేందుకు ఎంతోమంది అభిమానులు తరలి వచ్చారు.. ఈ క్రమంలో ప్రభాస్ మాత్రం పెదనాన్న చనిపోయారు అనే బాధను దిగమింగుకొని వారి కోపం ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానుల కోసం పెద్ద ఎత్తున భోజనాల కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయించారట.. వచ్చిన అభిమానులంతా తప్పకుండా భోజనం చేసి వెళ్ళండి డార్లింగ్ అంటూ చెప్పారని సమాచారం.. ఈ విషయం తెలిసిన చాలామంది రాజు ఎక్కడున్నా రాజే అంటూ కామెంట్లు పెడుతున్నారు..

ఓవైపు పెద్ద నాన్న చనిపోయిన బాధలో ఉన్నా కానీ దూరం నుంచి వచ్చిన అభిమానుల గురించి ఆలోచించి భోజనాలు ఏర్పాటు చేయడంపై పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటున్నారు.. ప్రభాస్ భోజనం చేసి వెళ్ళండని చెబుతున్నటువంటి ఒక వీడియో అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రభాస్ కు ఉన్న పెద్ద మనసు గురించి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తూ, మా అన్న దేవుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు..

also read:

Visitors Are Also Reading