Home » ఆ సూపర్ హిట్ ను ప్రభాస్ మిస్ చేసుకున్నాడా..?

ఆ సూపర్ హిట్ ను ప్రభాస్ మిస్ చేసుకున్నాడా..?

by Azhar
Ad

టాలీవుడ్ రెబల్ స్టార్ అయిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ లోనే సినిమాలు చేస్తున్నాడు అనే విషయ తెలిసిందే. అయితే ప్రభాస్ కు బాహుబలి సినిమా తర్వాత ఇప్పటివరకు తీసిన రెండు సినిమాలు కూడా ప్లాప్ గానే మిగిలిపోయాయి. కానీ ప్రభాస్ ఓ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నాడు అని తెలుస్తుంది.

Advertisement

తెలుగులో రామ్ హీరోగా వచ్చిన సినిమా ధృవ. అయితే ఈ తమిళ సినిమా అయిన తని ఒరువన్ సినిమాకు రీమేక్ గా వచ్చింది. తెలుగులో తమిళ్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ గా సురేందర్ రెడ్డి తీయగా.. తమిళ్ లో మోహన్ రాజా కథను రాసి జయం రవి హీరోగా తెరకెక్కించారు. కానీ మోహన్ రాజా ఈ సినిమా కథను కేవలం ప్రభాస్ కోసం రాసినట్లు తెలుస్తుంది.

Advertisement

మోహన్ రాజా ధృవ కథను ప్రారంభించిన సమయంలో ప్రభాస్ హీరోగా అనుకున్నారు. కానీ అప్పటికే ఆయన బాహుబలి సినిమాను ఒప్పుకున్నారు. దాని కంటే ముందు దొరికిన కొద్ది గ్యాప్ లో మిర్చి సినిమాలో చేసారు. అందుకే మోహన్ రాజా డైరెక్షన్ లో ఈ సినిమాను చేయడానికి వీలు కాలేదు అని తెలుస్తుంది. ఒకవేళ ప్రభాస్ ఆ సినిమాను చేసి ఉంటె.. పాన్ ఇండియా లెవల్ లో ఇంకా పెద్ద హిట్ అయ్యేది అనే విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

పొజిషన్ లో సూర్య స్థానంలోకి బాబర్..!

ఇండియా ఒక్క ఏడాదిలో 60 మంది ఆటగాళ్లను ఆడిస్తుందా..?

Visitors Are Also Reading