పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. యూవీక్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక తాజాగా నేడు థియేటర్లలో దేశవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రెబల్ ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు పరమహంస అనే పాత్రలో నటించారు.
Advertisement
ఇది సినిమాలో ముఖ్యమైన పాత్ర కాగా ఇదే పాత్ర కోసం ఇతర భాషల్లో సత్యరాజ్ ను తీసుకున్నారు. అయితే ఈ రోజు సినిమా థియేటర్ లలో విడుదల కాగా ఇతర దేశాల్లో చూసిన ప్రభాస్ అభిమానులు షాక్ అయ్యారు. ఇక్కడ రాధేశ్యామ్ తెలుగులో పరమహంస పాత్రలో కృష్ణంరాజు కనిపించగా ఇతర దేశాల్లో పరమహంస పాత్రలో సత్యరాజ్ కనిపించారు. తెలుగులో ట్రైలర్ లో కూడా కృష్ణం రాజు కనిపించగా విదేశాల్లో మాత్రం ఎందుకు ఆయనను లేకుండా చేశారంటూ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Advertisement
ఇప్పటికే ప్రభాస్ కృష్ణం రాజు కలిసి రెబల్ సినిమాలో నటించారు. ఈ సినిమా లో కృష్ణం రాజు పాత్ర హైలెట్ గా నిలిచింది. ఇక ఇతర భాషల్లో కృష్ణం రాజుకు పెద్దగా క్రేజ్ ఉండకపోవచ్చు కానీ తెలుగులో ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. అలాంటప్పుడు ఆయన ప్లేస్ లో సత్యరాజ్ ను చూపించడంతో ప్రభాస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
సినిమా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ దే ఈ తప్పు అంటూ మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా యూవీక్రియేషన్స్ ముందు నుండి ప్రభాస్ ఫ్యాన్స్ ను నిరాశపరుస్తున్న సంగతి తెలిసిందే. సినిమాపై సరైన అప్డేట్ లు ఇవ్వకపోవడం…ట్రైలర్ లో ఉన్న సీన్లు సినిమాలో లేకపోవడం. దాంతో ముందు నుండి ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూనే ఉన్నారు.