Home » చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌తో పోటీ ఉందా..? ప్ర‌భాస్ ఆన్స‌ర్ ఇదే…!

చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌తో పోటీ ఉందా..? ప్ర‌భాస్ ఆన్స‌ర్ ఇదే…!

by AJAY
Ad

బాహుబలి సినిమా తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. భారీ బడ్జెట్ తో గొప్ప విజువల్స్ తో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకుంది. బాలీవుడ్, కోలీవుడ్,మాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాకు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో నటించిన ప్రభాస్ నటనకు సైతం ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రంతోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.

Advertisement

ఈ సినిమా తర్వాత ప్రభాస్ కు బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియాకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా లో ఎన్టీఆర్ నటనకు కూడా సినీ లవర్స్ ఫిదా అయ్యారు. దాంతో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో సినిమా చేస్తున్నారు.

Advertisement

మరోవైపు ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టారు. అయితే తాజాగా ఓ ఆంగ్ల పత్రికలో ప్రభాస్ కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. తారక్ చరణ్ వల్ల పాన్ ఇండియా స్థాయిలో పోటీ పెరిగింది అని భావిస్తున్నారా అంటూ ప్రశ్న ఎదురైంది. దానికి ప్రభాస్ స్పందిస్తూ సినిమాలు విజయం సాధించడం వల్ల తనకు పోటీ పెరిగింది అని భావించడం లేదని చెప్పారు.

అందరం కలిసి సినిమాలను రూపొందిస్తే బాగుంటుందని అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని… ఆ సినిమా తనకెంతో నచ్చిందని చెప్పారు. రాజమౌళి ఇప్పుడు దక్షిణాది దర్శకుడు కాదని భారతీయ దర్శకుడు అని ప్రశంసలు కురిపించారు. కేజిఎఫ్ బ్లాక్ బస్టర్ కావడం… ఆ చిత్ర దర్శకుడితో సినిమా చేయ‌డం ఆనందంగా ఉందని చెప్పారు.

Visitors Are Also Reading