Home » సర్కారు వారి పాట సినిమాకు ప్రభాస్, ఎన్టీఆర్ ఫాన్స్ సపోర్ట్ వెనుక ఇంత కథ ఉందా..!!

సర్కారు వారి పాట సినిమాకు ప్రభాస్, ఎన్టీఆర్ ఫాన్స్ సపోర్ట్ వెనుక ఇంత కథ ఉందా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఎన్నో అంచనాల నడుమ వచ్చిన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ఒకటి రెండు మైనస్ లు ఉన్నప్పటికీ ఓవరాల్ గా హిట్ టాక్ తోనే తన జర్నీ స్టార్ట్ చేసింది అని చెప్పవచ్చు. సినిమా రిలీజ్ కు ముందే హీరో మహేష్ తో పాటు దర్శకుడు పరశురామ్ చివరికి ఏ సినిమాకు పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వని ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ లాంటివారు కూడా అదిరిపోయింది అని చెప్పడం.. పోకిరి తర్వాత ఆ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని చెప్పడంతో సినిమా అంచనాలు తారాస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. ఇదే అంచనాలతో థియేటర్లకు పరుగులెత్తిన ప్రేక్షకులు ఆ స్థాయిలో లేకపోవడంతో కాస్త నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.అయితే గురువారం రోజున ఉదయం నుండే మహేష్ బాబు యాంటీ ఫ్యాన్స్ తో పాటుగా ఒక సెక్షన్ హీరోల అభిమానులు సైతం డిజాస్టర్ మహేష్ బాబు అనే యాష్ ట్యాగుతో వైరల్ అవడంతో దీన్ని ట్రెండింగ్ లోకి తీసుకు వచ్చారు. అయితే మూవీ ఏబో ఆవరేజ్.. ఇక్కడ కూడా సినిమాలో అసభ్యత కానీ అశ్లీలత కానీ కనిపించలేదు అని చెప్పవచ్చు. ఈ మూవీకి ఫ్యామిలీతో సహా వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు.. అయితే ఇందులో మహేష్ బాబు చెప్పిన ఒక డైలాగ్ “నేను విన్నాను నేను ఉన్నాను” అనేది ఒక పార్టీకి అనుకూలంగా ఉందంటూ మరొక ప్రచారం తెచ్చి సినిమాకి ఏదోలా నెగిటివ్ టాక్ తీసుకురావడానికి చాలా ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. దీనికి తోడుగా సిడెడ్ ప్రాంతాల్లో సైక్లోన్ ప్రభావం కూడా పడింది. భారీగా వర్షాలు వల్ల చాలా ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు కూడా రద్దయ్యాయి. మొదటి రోజు రెండు ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్ లు కూడా డల్ గానే ఉన్నాయి. దీంతో ఎక్కడ ఖాళీ కుర్చీలు కనబడిన ఫస్ట్ రోజే జనాలు లేరంటూ సినిమాకు నెగిటివ్ టాక్ తీసుకువచ్చారు. అయితే ఇందులో ప్రభాస్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీకి ఫుల్ సపోర్ట్ చేశారని తెలుస్తోంది. ఈ హీరోల ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేసి గ్రూపులో మెసేజ్ వైరల్ చేశారు. రికార్డు స్థాయిలో వసూలు చేస్తుందని మెసేజ్ లు ఫార్వర్డ్ చేశారు.

Advertisement

ALSO READ;

Advertisement

శృతిహాసన్ తల్లికి ఏంటి ఈ కష్టాలు..డబ్బుల్లేక చివరికి స్టేజ్ షోలలో…!

“సర్కారు వారి పాట” సినిమా పై ‘డార్లింగ్’ ఇచ్చిన రివ్యూ ఇదేనా..!!

 

Visitors Are Also Reading