Home » చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ కు మూడుసార్లు గుండెపోటు – పోసాని సంచలనం

చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ కు మూడుసార్లు గుండెపోటు – పోసాని సంచలనం

by Bunty

చంద్రబాబు నాయుడు వల్ల నందమూరి తారకరామారావు గారికి ఈ మూడు సార్లు గుండెపోటు వచ్చినట్లు సినీ నటుడు, వైసిపి నేత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విజయవాడలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను వైసిపి పార్టీ నిర్వహించింది. ఈ వేడుకలకు సినీ నటుడు, వైసిపి నేత పోసాని కృష్ణమురళి, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ , నందమూరి లక్ష్మీపార్వతి తదితరులు హాజరయ్యారు. ఇ

క ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ…. నందమూరి లక్ష్మీపార్వతి కి… ఓ వ్యక్తితో సంబంధం ఉన్నట్లు చంద్రబాబు చిత్రీకరించాడని ఫైర్ అయ్యారు. కానీ అలనాటి ఎన్టీఆర్ ఆ ఆరోపణలను నమ్మలేదని వెల్లడించారు. చంద్రబాబు చేష్టల కారణంగా ఎన్టీఆర్ కు మూడుసార్లు గుండెపోటు వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి. అలాగే.. ఎన్టీఆర్కు తన కొడుకులను కూడా దూరం చేశాడని ఆరోపించారు.

ఎన్టీ రామారావు అనారోగ్యంగా ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రి పదవిని లాగేసుకునే.. కుట్రలకు చంద్రబాబు తెరలేపాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చర్యల వల్ల ఇప్పటికి… ఎన్టీఆర్ ఆత్మ క్ష్బోభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో దుర్మార్గుడు చంద్రబాబు ఒక్కడేనని… ఎటు వెళ్లిన పర్లేదు కానీ… చంద్రబాబు వైపు అస్సలు వెళ్లకూడదని కోరారు పోసాని కృష్ణమురళి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

IPL 2023 : ఐపీఎల్ విజేత, రన్నరప్ జట్లకు ఎన్ని కోట్లు ఇస్తారో తెలుసా?

Ambati Rayadu : ఐపీఎల్ కు అంబటి రాయుడు గుడ్ బై

పూజా హెగ్డే ఆస్తులు ఎంతో తెలుసా.. స్టార్ హీరోల కంటే ఎక్కువ

Visitors Are Also Reading