Home » స్టేజ్ పైనే బాలయ్యకు సాష్టాంగ నమస్కారం చేసిన హీరోయిన్

స్టేజ్ పైనే బాలయ్యకు సాష్టాంగ నమస్కారం చేసిన హీరోయిన్

by Bunty
Ad

నందమూరి బాలకృష్ణ.. హీరోగా నటించిన అఖండ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు.. అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెలుతోంది అఖండ మూవీ. మరో రెండు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ ను అందుకోబోతుంది అఖండ. ఇక ఈ సినిమా విజయవంతం కావడంతో.. నిన్న వైజాగ్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించింది అఖండ టీం. ఇక ఈ విజయోత్సవ సభ కు అఖండ చిత్ర బృందం మొత్తం తరలి వచ్చింది.

Advertisement

poorna

అయితే ఈ సందర్భంగా ఈ సినిమాలో నటించిన నటి పూర్ణ… చాలా ఎమోషనల్ అయ్యింది. స్టేజ్ ఎక్కి మైకు పట్టగానే… జై బాలయ్య అంటూ అందరినీ ఎంటర్టైన్ చేసింది పూర్ణ. అఖండ సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది పూర్ణ. అనంతరం హీరో బాలయ్య గురించి మాట్లాడుతూ… స్టేజి పైనే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది పూర్ణ.

Advertisement

బాలయ్య సినిమాలో నటించడం ఒక అదృష్టమని… ఆయన ఒక స్వీట్ పర్సన్ అంటూ ప్రశంసలు కురిపించింది ఈ అమ్మడు. ప్రస్తుతం నటి పూర్ణ సాష్టాంగనమస్కారం చేసినా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Visitors Are Also Reading