Home » విమానంలో ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు…పూజా హెగ్డే ఎమోషనల్ పోస్ట్….!

విమానంలో ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు…పూజా హెగ్డే ఎమోషనల్ పోస్ట్….!

by AJAY
Ad

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో పూజా హెగ్డే కూడా ఒకరు. ముకుంద సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముకుంద సినిమా సూపర్ హిట్ అవ్వకపోయినా పూజా హెగ్డేకు మాత్రం వరుస ఆఫర్లు వచ్చాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠ పురం సినిమా తో పూజా హెగ్డే కెరీర్ మలుపు తిరిగింది.

Advertisement

ఆ తర్వాత స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తోంది. ఇప్పటికే పూజా హెగ్డే మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్లతో నటించింది. మరోవైపు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ పూజా అవకాశాలు అందుకుంటోంది. కేవలం సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా ఐటెం పాటలకు సైతం స్టెప్పులు వేస్తూ అలరిస్తోంది. రీసెంట్ గా వచ్చిన ఎఫ్ -3 సినిమాలో పూజా ఐటమ్ సాంగ్ చేసింది.

Advertisement

అంతేకాకుండా రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే పూజా ఎప్పుడూ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలు, సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ తాజాగా మాత్రం ఇండిగో విమాన సిబ్బందిపై ఫైర్ అవుతూ ఓ ట్వీట్ చేసింది. పూజా హెగ్డే ఇండిగో విమాన సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించింది. ముంబై నుండి వస్తున్న ఇండియా విమానంలో విపుల్ నకాషే అనే వ్యక్తి తనతో మొరటుగా ప్రవర్తించడని ఆరోపించింది.

pooja hegde

pooja hegde

ఎటువంటి కారణం లేకుండానే తమ తో పూర్తిగా …అహంకారం అజ్ఞానం తో బెదిరిస్తూ మాట్లాడాడని చెప్పింది. సాధారణంగా తను సమస్యలపై స్పందించను అని కానీ ఈ ఘటన తనను ఎంతో బాధ పెట్టిందని పూజాహెగ్డే ఆవేదన వ్యక్తం చేసింది. మరి పూజా కంప్లైంట్ తో సిబ్బందిపై ఇండిగో సంస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Visitors Are Also Reading