Home » అది కాఫీ మీటింగే..మంచు విష్ణు గాలి తీసిన మంత్రి..!

అది కాఫీ మీటింగే..మంచు విష్ణు గాలి తీసిన మంత్రి..!

by AJAY
Ad

ఏపీ సిఎం జ‌గ‌న్ తో ఫిబ్ర‌వ‌రి 10వ తేదీన స్టార్ హీరోలు చిరంజీవి,మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్ తో పాటూ ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, కొర‌టాల శివ స‌మావేశమ‌య్యారు. ఈ స‌మావేశంలో సినిమా టికెట్ల అంశం ఇత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. అయితే ఈ స‌మావేశానికి సీనియ‌ర్ హీరో మోహ‌న్ బాబు గానీ ఆయ‌న కుమారుడు మా అధ్య‌క్షుడు మంచు విష్ణు కానీ హాజ‌ర‌వ్వ‌లేదు. కానీ స‌మావేశం త‌ర‌వాత మరుస‌టి రోజు ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్నినాని ఏకంగా మోహ‌న్ బాబు ఇంటికి వెళ్లి క‌లిసారు.

Advertisement

అయితే పేర్నినానికి ఆతిద్యం ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌ని….సినిమా ఇండ‌స్ట్రీపై తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను ఆయ‌న వివ‌రించార‌ని మంచు విష్ణు సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు. దాంతో మోహ‌న్ బాబు ఇంటికి పేర్ని నాని ఎందుకు వెళ్లారు. అస‌లు ఏం జ‌రుగుతుంది. అంటూ వార్త‌లు రావ‌డం హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై తాజాగా మంత్రి పేర్నినానిని మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించారు. మోహ‌న్ బాబు ఇంట్లో జ‌రిగిన స‌మావేశంలో ఏం చ‌ర్చించార‌ని ప్ర‌శ్నించారు.

Advertisement

దానికి పేర్నినాని మండిప‌డ్డారు. తాను కాఫీకి వెళ్లాన‌ని అక్క‌డ ఎలాంటి స‌మావేశం జ‌ర‌గ‌లేదని మోహ‌న్ బాబు కాఫీకి ఆహ్వానిస్తేనే వెళ్లాన‌ని చెప్పారు. బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇంటికి పెళ్లికి వెళ్ల‌గా మోహ‌న్ బాబు ఆహ్వానిస్తే వెళ్లాన‌ని చెప్పారు. దాంతో మీరు మంచు విష్ణు ట్వీట్ చూడ‌లేదా అని ప్ర‌శ్నించ‌గా నేను ట్వీట్ల మంత్రినా సినిమాటో గ్ర‌ఫి మంత్రినా అంటూ మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు.

ALSO READ : సుధీర్ ర‌ష్మి మ‌ధ్య‌లో ఏముంది..జ‌బ‌ర్ద‌స్త్ నిజాలు బ‌య‌టపెట్టిన చ‌మ్మ‌క్ చంద్ర‌..!

ఎవ‌రెవ‌రు ఏవో ట్విట్లు చేస్తే దానికి ప్ర‌భుత్వాన్ని స్పందించ‌మంటే అన్యాయం అంటూ ఫైర్ అయ్యారు. ఇక మంచు విష్ణు ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించామ‌ని ట్వీట్ చేస్తే పేర్ని నాని మాత్రం ఎవ‌రెవ‌రి ట్విట్ లో అంటూ గాలీ తీశారని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ సంధ‌ర్భంగా పేర్నినాని రామ్ గోపాల్ వ‌ర్మ‌పై కూడా ఫైర్ అయ్యారు.

Visitors Are Also Reading