Home » Breaking : మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి పద్మశ్రీ….!

Breaking : మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి పద్మశ్రీ….!

by AJAY
Ad

టాలీవుడ్ సంగీత దర్శకుడు కీరవాణికి కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. అంతేకాకుండా చిన్న జీయర్ స్వామికి పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. కీరవాణి తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు స్వరాలు సమకూర్చారు. ఆయన సంగీతం అందించిన ఎన్నో పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

Advertisement

కీరవాణి ఒకప్పటి స్టార్ హీరోల నుండి నేటితరం హీరోల వరకు సంగీతాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాకు ఆయనే స్వరాలు సమకూర్చారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు సైతం కీరవాణి స్వరాలు సమకూర్చిన సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో కీరవాణి ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించారు. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ కు సైతం నామినేట్ అయ్యింది.

Advertisement

దాంతో కీరవాణి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇక ఇప్పుడు కీరవాణికి పద్మశ్రీ ని ప్రకటించడంతో ఆయన అభిమానులు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే కీరవాణికి పద్మశ్రీ అవార్డు రావడంపై సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు… అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ అభినందనలు తెలుపుతున్నారు.

Also read : “మర్యాద రామన్న” సినిమాలోని హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఏం చేస్తోందంటే?

Visitors Are Also Reading