Home » పాకిస్థాన్ ఓటమి.. ఇండియాపై అనుచిత వ్యాఖ్యలు..!

పాకిస్థాన్ ఓటమి.. ఇండియాపై అనుచిత వ్యాఖ్యలు..!

by Azhar
Ad

ఆసియా కప్ 2022 ఫైనల్స్ లో శ్రీలంక పైన పాకిస్థాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ టైటిల్ గెలుస్తుంది అనుకున్న భారత్ ను ఓడించి ఫైనల్స్ కు రాకుండా చేసిన లంక.. ఫైనల్స్ లో పాక్ ను కూడా చిత్తుగా ఓడించింది. దాంతో శ్రీలంక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో మునిగిపోతే.. పాకిస్థాన్ ఫ్యాన్స్ మాత్రం నిరాశకు గురయ్యారు. అలాగే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మెన్ రమీజ్ రాజాది కూడా అదే పరిస్థితి.

Advertisement

అయితే ఓ కీలక పదవిలో ఉన్న వ్యక్తి తన ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవాలి. కానీ పాకిస్థాన్ ఓడిపోయిన భాధలో ఇండియా పైన అనుచిత వ్యాఖ్యలు అనేవి చేసాడు రమీజ్ రాజా. పాక్, లంక మధ్య జరిగిన ఫైనల్స్ చూడటానికి రమీజ్ రాజా యూఏఈకి వచ్చాడు. కానీ ఆ మ్యాచ్ లో పాక్ ఓడిపోవడంతో నిరాశగా బయటకు వచ్చిన రమీజ్ రాజాకు మీడియా నుండి వరుస ప్రశాలు ఎదురయ్యాయి.

Advertisement

అందులో ఒక్కరు.. ఈ ఓటమితో పాక్ అభిమానులు భాధపడుతున్నారా..? అని ప్రశ్నించాడు. ఇక దానికి.. నువ్వు ఇండియా నుండి వచ్చావా.. మేము ఓడిపోతే మీ ఇండియాకు సంతోషమే కదా..! అంటూ కామెంట్స్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా పాక్ ఓటమితో ఇండియన్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ అనేది అందరికి తెలిసిన నిజమే కదా..!

ఇవి కూడా చదవండి :

మొదటి బంతి పడకుండానే 9 రన్స్ ఇచ్చిన లంక..!

గుడ్ న్యూస్.. బుమ్రా వచ్చేస్తున్నాడు..!

Visitors Are Also Reading