పాయల్ రాజ్ పుత్ గురించి తెలుగు సినిమా అభిమానులకు అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి రెండు, మూడు సినిమాలు మొదట చేసిన పాయల్ కు సక్సెస్ అనేది రాలేదు. కానీ ఆ తర్వాత కార్తికేయ హీరోగా వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ పాత్ర తనకు బాగా పేరు తెచ్చి పెట్టింది. అమ్మాయిలలో ఇలా కూడా ఉంటారు అనే ఆలోచన ఈ సినిమాలోని పాయల్ పాత్ర అందరికీ తెలియజేసింది. కానీ ఈ సినిమాతో వచ్చిన సక్సెస్, అలాగే క్రేజ్ ను పాయల్ సరిగ్గా వాడుకోలేదు అని చెప్పాలి.
READ ALSO : మహేష్ బాబు కొత్త సినిమాకు జగన్ పథకం పేరు!
Advertisement
ఎందుకంటే ఈ సినిమా తర్వాత ఆ పాయల్ చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ గానే నిలిచాయి. కాగా, తాను అస్వస్థతకు గురయ్యానంటూ నటి పాయల్ రాజ్ పుత్ అభిమానులకు షాక్ ఇచ్చారు. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ సోకిందని, ప్రస్తుతం దాన్నుంచి కోలుకుంటున్నాను అని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చికిత్స తీసుకున్నప్పటి ఫోటో షేర్ చేశారు. నేను చాలా తక్కువ నీరు తాగేదాన్ని.
Advertisement
READ ALSO : టీమిండియాలో నో ఛాన్స్.. ఇక సీరియల్లో నటిస్తున్న శిఖర్ ధావన్!
అందుకే కిడ్నీ ఇన్ఫెక్షన్ కు గురయింది. ఈ సందర్భంగా మీరు ఎక్కువగా తాగాలని, మీ అందరికీ గుర్తు చేస్తున్న. ప్రస్తుతం యాంటీబయాటిక్స్ చివరి డోస్ తీసుకున్న. అంతా సెట్ అయింది. మనకెదురైనా అవాంతరాలను అధిగమించగలగాలి. ఎంత ఇబ్బంది ఉన్నా నా తదుపరి సినిమా చిత్రీకరణను మాత్రం నేను ఆపలేదు. ఆ ప్రాజెక్టు నాకెంతో ప్రత్యేకమని పేర్కొన్నారు.
READ ALSO : కోహ్లీ తినే బియ్యం కేజీ ఎంతో తెలుసా ? అందుకే అంత ఫిట్ గా ఉంటాడా !