Home » 2024 ఎన్నిక‌ల్లో అండ‌గా ఉండండి.. నేను చావ‌డానికైనా సిద్ధ‌మే : ప‌వ‌న్ క‌ల్యాణ్

2024 ఎన్నిక‌ల్లో అండ‌గా ఉండండి.. నేను చావ‌డానికైనా సిద్ధ‌మే : ప‌వ‌న్ క‌ల్యాణ్

by Anji
Ad

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌ర‌సాపురంలో మ‌త్య్స‌కారుల అభ్యున్న‌తి స‌భ‌లో పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మ‌త్స్య‌కారుల‌కు సంబంధించిన ఏపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీవో నెంబ‌ర్ 217 ను చింపేశారు. జీవోకు వ్య‌తిరేకంగా పోరాటం చేసేందుకు స‌భ‌ను ఏర్పాటు చేశారు. జీవోపై ప్లాన్ చెప్ప‌ను. అవ‌స‌రం అయితే జైలుకు వెళ్ల‌డానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీలో ఒక్క‌డికి గుండె ధైర్యం వ‌స్తే ప్ర‌తీ ఒక్క‌రికీ ధైర్యం వ‌స్తుంది.

Also Read :  Video Viral : కాన్వాయ్ పై కింద‌ పడ్డ పవన్ కళ్యాణ్

Advertisement

వైసీపీ పిచ్చి పిచ్చి వేషాల‌కు జ‌న‌సేన భ‌య‌ప‌డ‌ద‌ని పేర్కొన్నారు. అక్ర‌మ కేసుల‌కు వ్య‌తిరేకంగా ఏ స్థాయిలోనైనా పోరాడుతాను అని.. మ‌త్స్య‌కారుల కోసం జైలుకు వెళ్ల‌డానికైనా సిద్ధంగా ఉన్నాన‌న్నారు. చెరువులు వ‌దిలేయండి. మ‌త్స్య‌కారుల‌కు వ‌దిలేస్తే బాగుంటుంది. మ‌త్స్య‌కారుల జీవ‌నోపాధిని కొట్ట‌కండి. వైసీపీకి అధికారం ఇచ్చింది చికెన్‌, మ‌ట‌న్ కొట్టుల‌ను పెట్టుకోవ‌డానికా అని ప్ర‌శ్నించారు. ముఖ్యంగా నేను వంగి వంగి దండాలు పెట్ట‌డానికి రాజ‌కీయాల్లోకి రాలేదు అని, చిన్న వ‌ల‌తో స‌ముద్రంలోకి వెళ్లాలంటే మ‌త్స్య‌కారుల‌కు ఎంత స‌హ‌నం ఉండాలని పేర్కొన్నారు. జ‌న‌సేన‌కు క‌నీసం ప‌ది మంది ఎమ్మెల్యేలు ఉంటే జీవో 217 వ‌చ్చేది కాద‌న్నారు.

Advertisement

లక్షలమంది పొట్టకొట్టే జీఓ 217ను చించాను. మీరు కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి. మరబోట్లు రాకముందు సముద్రం వద్ద మత్స్యకారులు ఉండేవారు. రాను రాను చట్టాలతో మత్స్యకారులు నిబంధనల్లో చిక్కుకుపోయారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలను లెక్కచెయ్యను. గత ప్రభుత్వంలో మత్స్యకారులు ఇళ్లు కట్టుకుంటే రూ.70వేలు అదనంగా ఇచ్చేవారు. 217జీఓను ఎక్కడో‌ఒక చోట అడ్డుకోవాలి. మీరు నిలబడితే నేను మీకు అండగా ఉంటా. వైసీపీ నాయకులు పైనుంచి దిగివచ్చారా..? ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యమైన చట్టాలు చెయ్యాలి. వచ్చే ఎన్నికలలో నాకు అండగా నిలబడండి. నేను చావడానికైనా సిద్దమే.. తల వంచనని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

Also Read :  ఈ డైరెక్ట‌ర్లు వారి వారి సినిమాల్లో ఇలా క‌నిపించారు! మీరు గ‌మ‌నించారా?

Visitors Are Also Reading