Home » అల్లు అర‌వింద్ పై ప‌వ‌న్ రివేంజ్ తీర్చుకుంటున్నారా..?

అల్లు అర‌వింద్ పై ప‌వ‌న్ రివేంజ్ తీర్చుకుంటున్నారా..?

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో అల్లు అరవింద్ కూడా కీలక పాత్ర పోషించారన్న‌ సంగతి తెలిసిందే. అయితే ఈ పార్టీ విషయంలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల పవన్ కళ్యాణ్ మరియు అల్లు అరవింద్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని అప్పట్లో గట్టిగా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ కి మధ్య సత్సంబంధాలు లేవని కూడా ఇండ‌స్ట్రీలో టాక్ ఉంది. అయితే ఇప్పుడు మరో వార్త హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయ‌క్ సినిమాను ఫిబ్రవరి 25 న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజున మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గ‌ని సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఒకే రోజు ఇద్దరు మెగా హీరోలు తలపడుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

మరోవైపు పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ పై రివేంజ్ తీర్చుకోవడానికే భీమ్లా నాయ‌క్ సినిమాను గ‌నికి పోటీగా ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నార‌ని కూడా టాలీవుడ్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌ని సినిమాకు అల్లు అర‌వింద్ పై రివేంజ్ కి సంబంధం ఏంట‌ని డౌట్ రావ‌చ్చు….అయితే గ‌ని సినిమాకు అల్లు అర్జున్ కుమారుడు బాబి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాతోనే బాబీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు.

దాంతో ప‌వ‌న్ రివేంజ్ కోస‌మే ఇలా చేస్తున్నార‌ని టాక్…. ఇదిలా ఉంటే భీమ్లా నాయక్ సినిమాను ఏపీలో 100% థియేటర్లకు అనుమతులు ఇచ్చిన తర్వాతే విడుదల చేస్తామని అప్పట్లో ప్రకటించారు. కానీ రాత్రికి రాత్రే ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకే అలా జరిగిందని… పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ మీద రివేంజ్ తీర్చుకుంటున్నారని టాక్.

Visitors Are Also Reading