Home » తెలుగులో ఆ రికార్డ్ కేవలం పవన్, మహేష్ కు మాత్రమే సొంతం…!

తెలుగులో ఆ రికార్డ్ కేవలం పవన్, మహేష్ కు మాత్రమే సొంతం…!

by Azhar
Ad
కరోనా కారణంగా సినిమాల విడుదల చాలా బ్రేక్ వచ్చింది. అందుకే గత ఏడాది నుండి ఇప్పటివరకు తెలుగులో భారీ సంఖ్యలో సినిమాలు అనేవి వచ్చాయి. అయితే ఈ ఏడాది మన తెలుగులో చాలా వరకు పాన్ ఇండియా సినిమాలతో పాటుగా తెలుగు సినిమాలు కూడా ఎక్కువగానే వచ్చాయి. అయితే ఈ ఏడాది విడుదలైన పాన్ ఇండియా సినిమాల్లో ప్రభాస్ రాధే శ్యామ్ మినహా. మిగిలిన సినిమాలు అన్ని మంచి హిట్స్ అందుకున్నాయి. అందులో ఆర్ఆర్ఆర్ అలాగే కెజిఎఫ్ 2 సినిమాలు కూడా ఉంటాయి.
కానీ కేవలం మన తెలుగులో మాత్రమే విడుదలైన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇప్పటివరకు కూడా మన తెలుగు సినిమాలు ఈ ఏడాది పదుల సంఖ్యలో విడుదల కాగా.. అందులో అన్ని ప్లాప్ అయ్యాయి. కేవలం ఇద్దరు హీరోల సినిమాలు మాత్రమే హిట్ అందుకొని మంచి కలెక్షన్స్ అనేవి సాధించాయి. ఆ అహీరోలు ఎవరో కాదు.. పవర్ స్టార్ పవన కళ్యాణ్.. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ ఏడాది వచ్చిన అన్ని తెలుగు సినిమాల్లో వీరి సినిమాలే 100 కోట్ల కలెక్షన్స్ అనేవి అందుకొని హిట్ గా నిలిచాయి.
అయితే ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ అనే సినిమా విడుదల అయిన తర్వాత మంచి టాక్ తెచ్చుకుంది. అందుకే ఈ సినిమా అనేది 132 కోట్ల కలెక్షన్స్ అనేవి సాధించింది. అలాగే మహేష్ బాబు యొక్క సర్కారువారి పాట కూడా హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఇక కలెక్షన్స్ లో 155 కోట్ల మార్క్ ను అందుకుంది. అయితే వీరిద్దరూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. పవన్ దర్శకుడు క్రిష్ తో అలాగే.. మహేష్ త్రివిక్రమ్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఆ సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్స్ అనేవి సాధిస్తాయో చూడాలి.

Advertisement

Visitors Are Also Reading