Home » ఆ స‌మ‌యంలో మ‌హేశ్ బాబుకు మ‌ద్ద‌తుగా నిలిచా..వైర‌ల్ అవుతున్న ప‌వ‌న్ కామెంట్స్..!

ఆ స‌మ‌యంలో మ‌హేశ్ బాబుకు మ‌ద్ద‌తుగా నిలిచా..వైర‌ల్ అవుతున్న ప‌వ‌న్ కామెంట్స్..!

by AJAY
Ad

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు పుట్టిన‌రోజు సంధ‌ర్బంగా అభిమానులు, సెల‌బ్రెటీలు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. కాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా సోషల్ మీడియాలో సుధీర్ఘ లేఖ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన లేఖ వైర‌ల్ అవుతోంది. లేఖ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తి క‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. అంతే కాకుండా మ‌హేశ్ బాబుతో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పుకొచ్చారు.

Advertisement

Advertisement

మ‌హేశ్ బాబు కృష్ణ న‌ట‌వార‌సత్వాన్ని విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తున్నారంటూ ప్ర‌శంసించారు. త‌న సినిమాల‌తో యువత‌రాన్ని అల‌రిస్తున్నార‌ని పేర్కొన్నారు. మహేశ్ బాబు చేప‌డున్న సేవా కార్య‌క్ర‌మాలు, హృద్రోగ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు శ‌స్త్ర చికిత్స‌లు చేయించ‌డం అభినంద‌నీయం అని అన్నారు.

జ‌ల్సా సినిమాలో మ‌హేశ్ బాబు వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. త్రివిక్ర‌మ్ అడిగిన వెంట‌నే ఒప్పుకోవ‌డం గొప్ప విష‌యం అని పేర్కొన్నారు. అంతే కాకుండా అర్జున్ సినిమా స‌మ‌యంలో పైర‌సీకి వ్య‌తిరేకంగా మహేశ్ బాబు గ‌ళం విప్ప‌గా తాను కూడా మ‌ద్ద‌తుగా నిలిచానని పేర్కొన్నారు. క‌థానాయ‌కుడిగా త‌న‌దైన పంథాలో వెళుతున్న మ‌హేశ్ బాబు మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాల‌ని కోరుత‌న్నాని పేర్కొన్నారు.

Visitors Are Also Reading