Home » పవన్ సినిమాకు కష్టం వస్తే నిర్మాతలు వస్తారా..? భీమ్లా నాయక్ వాయిదా పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం..!

పవన్ సినిమాకు కష్టం వస్తే నిర్మాతలు వస్తారా..? భీమ్లా నాయక్ వాయిదా పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం..!

by AJAY
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన రానా ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి బరిలోకి రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్, ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమాతో పాటు మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట కూడా వచ్చి చేరాయి. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ విడుదల నేపథ్యంలో మొదట సర్కారు వారి పాట సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు. ఏప్రిల్ 1న సర్కారు వారి పాట చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

Advertisement

Advertisement

ఆ తర్వాత భీమ్లా నాయక్ సినిమా కూడా వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ లో “పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు నేను క్షమాపణ చెప్తున్నాను. పరిస్థితి నా చేతుల్లో నుంచి దాటిపోయింది. మా పవన్ కళ్యాణ్ గారి మాటలను నేను ఫాలో అవుతాను. ఇండస్ట్రీ గురించి ఆలోచించే వ్యక్తుల్లో ఆయన ముందుంటారన్న సంగతి మీకు తెలిసిందే. సినిమాను ఖచ్చితంగా శివరాత్రికి విడుదల చేస్తాము అంటూ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో మూడు పెద్ద స్టార్స్ పోటీ పడితే ఆ ప్రభావం బాక్సాఫీస్ పై పడే అవకాశం ఉందని… ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అంత మంచిది కాదని ప్రొడ్యూసర్స్ గిల్డ్ భావించినట్లు తెలుస్తోంది. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించి సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్మాతలకు సూచించినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాను వాయిదా వేయడంపై మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి తమ హీరో సినిమా చూస్తూ పండుగ జరుపుకుందాం అని అనుకున్న అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ అభిమాని పవన్ కళ్యాణ్ సినిమాకు సమస్య వస్తే నిర్మాతలు వస్తారా అంటూ ట్విట్టర్ లో ప్రశ్నించారు..? బండ్లన్న నువ్వు అడగొచ్చు కదా మా తరఫున అంటూ బండ్ల గణేష్ ను టాగ్ చేసారు. దానికి రిప్లై ఇచ్చిన బండ్ల గణేష్ న్యాయానికి ధర్మానికి రోజులు లేవు బ్రదర్ అంటూ సమాధానమిచ్చాడు.

Visitors Are Also Reading