Home » సూపర్ స్టార్ కృష్ణ మాటలకు కన్నీరు పెట్టుకున్న పవిత్రా లోకేష్.. ఏం జరిగిందంటే..

సూపర్ స్టార్ కృష్ణ మాటలకు కన్నీరు పెట్టుకున్న పవిత్రా లోకేష్.. ఏం జరిగిందంటే..

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొన్ని నెలల నుంచి నరేష్ పవిత్ర లోకేష్ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న విషయం అందరికి తెలిసిందే. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో అబద్ధం ఉందో తెలియదు కానీ వీళ్ళ గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీరి వ్యవహారంపై సూపర్ స్టార్ కృష్ణ స్పందించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ నరేష్ వ్యక్తిగత విషయం అది.

Advertisement

ఆయన ఏం చేస్తారు అన్నది అతనికి సంబంధించిన విషయం. అతను నాకు కొడుకు లాంటి వాడు అతని బాగోగులు అతనే చూసుకోగలడు. వాళ్ళు ఏమీ చిన్నపిల్లలు కాదు. ఒకవేళ నరేష్ నాలుగో పెళ్లి చేసుకోవాలి అనుకున్న అందులో తప్పు ఏముంది. అది అతని లైఫ్ వ్యక్తిగతనికి సంబంధించిన విషయం కాబట్టి దాని గురించి నేను ఎలాంటి మాటలు మాట్లాడానని అన్నారు. నరేష్ పెళ్లి చేసుకుని హాయిగా ఉంటే నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఈ విధంగా కృష్ణ మాట్లాడిన మాటలకు పవిత్రా లోకేష్ కన్నీరు పెట్టుకున్నారని తెలుస్తోంది.

Advertisement

ఎందుకంటే కృష్ణ కుటుంబానికి సంబంధించిన ఎలాంటి ఫంక్షన్ లు అయిన నరేష్ తో కలిసి పవిత్ర లోకేష్ అటెండ్ అవుతుంది. ఓ పక్క సోషల్ మీడియాలో వివిధ వార్తలు వస్తున్న తరుణంలో కృష్ణ వాటన్నిటికీ ఎలాంటి తావు ఇవ్వకుండా ఎంతో పెద్ద మనసుతో వ్యవహరించిన తీరు పవిత్రను కన్నీళ్లు పెట్టుకునేలా చేసిందట. ఇలాంటి వార్తలు వస్తున్నా ఆయన స్పందించిన తీరు కృష్ణ గారి పెద్ద మనసుకు పవిత్ర లోకేష్ చాలా బాధ పడిందని తెలుస్తోంది. ఏది ఏమైనా కృష్ణ గారు ఈ విధంగా స్పందించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ:

Visitors Are Also Reading