Home » ఆ టైంలో పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడారంటూ.. నరేష్ పై పవిత్ర లోకేష్ కామెంట్స్ వైరల్..?

ఆ టైంలో పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడారంటూ.. నరేష్ పై పవిత్ర లోకేష్ కామెంట్స్ వైరల్..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి ఎంతోమందిని మెప్పించిన నటి పవిత్ర లోకేష్. ఈ మధ్యకాలంలో ఆమె సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం పవిత్ర లోకేష్ తెలుగు ఇండస్ట్రీ లో తల్లి,అత్త,అక్క పలు పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపును పొందుతోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన రెడ్ సినిమాలో మాత్రం ఒక విలక్షణమైన పాత్రను చేసి చాలా భిన్నంగా కనిపించింది ఆమె. సిగరెట్ తాగుతూ బూతులు తిడుతూ కాస్త గడుసు పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు విషయాల్లో ఓపెన్ కామెంట్లు చేసింది. అవేంటో చూద్దాం.. గత కొద్దికాలంగా పవిత్రా లోకేష్ మరియు మా అధ్యక్షుడు నరేష్ మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ మా అధ్యక్షుడిగా నరేష్ చాలా గొప్పగా పని చేస్తున్నారని, కరోనా లాంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా అందరికీ అందుబాటులో ఉండి ధైర్యాన్ని అందించారని అన్నారు. ప్రతి ఒక్కరికీ పర్సనల్ గా ఫోన్ లు చేసి వారి యోగక్షేమాలు కనుక్కున్నారని, అలాంటి మంచి మనసు ఎవరికీ ఉంటుందని పవిత్రా లోకేష్ చెప్పింది. ఈ సమయంలో మా నిధి నుండి కాకుండా తన డబ్బులతో ఎంతో మందికి సహాయం అందించారని అది నాకు తెలుసు అని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులు ఇలాంటి బాధ్యత అప్పగిస్తే ఎంతో బాధ్యతగా నిర్వహిస్తారని చెప్పుకొచ్చింది నటి పవిత్ర. కుంఫు గురించి చెబుతూ ఇది అందరూ నేర్చుకోవాలని, నేనేమీ ఫెమినిస్టును కాదని అన్నారు. నరేష్ ని చూస్తే మనం ఏవిధంగా ఉండాలో అర్థం అవుతుందని తెలియజేశారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

ALSO READ;

Advertisement

ఆ స్టార్ హీరోయిన్‌తో SP బాలసుబ్ర‌హ్మ‌ణ్యం కుమారుడు చ‌ర‌ణ్‌

మంచు విష్ణు భార్య ఎవరో తెలుసా..? డాక్టర్ అవ్వాల్సిన ఆమె మంచు వారింటింకి పెద్ద కోడలయ్యింది..!

 

Visitors Are Also Reading