టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు పరుచూరి బ్రదర్స్. రచయితలు గా పరుచూరి బ్రదర్స్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ కథలను టాలీవుడ్ కు అందించారు. చిన్న పెద్ద హీరోలు అని తేడా లేకుండా అందరితోనూ పనిచేసి మంచి సినిమాలను తెరకెక్కించారు. ఇక పరుచూరి బ్రదర్స్ లో అన్న పరుచూరి వెంటేశ్వరరావు రచయిత గా నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.
Advertisement
అయితే గత కొంతకాలం గా పరుచూరి వెంకటేశ్వరరావు మీడియా కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆయన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దర్శకుడు జయంత్ పరంజి పరుచూరి వెకటేశ్వరరావు తో దిగిన ఫోటోను సోషల్ మీడియా లో షేర్ చేశారు.
Advertisement
ఈ ఫోటోకు….నా గురువుగారు పరుచూరి వెంటేశ్వరరావు ఇలా అయిపోవడం బాధగా ఉంది. కానీ ఆయన మానసికంగా ఎప్పటి లాగానే చురుకుగా ఉన్నారు. పరుచూరి బ్రదర్స్ 300 సినిమాలకు రచయితగా పనిచేయగా అందులో 200 లకు పైగా సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. అంటూ దర్శకుడు ఫోటోలు క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పరుచూరి వెంకేశ్వరరావు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.