Home » బొప్పాయి పండును ఈ సీజ‌న్‌లో త‌ప్ప‌కుండా తినాలి.. ఎందుకో తెలుసా..?

బొప్పాయి పండును ఈ సీజ‌న్‌లో త‌ప్ప‌కుండా తినాలి.. ఎందుకో తెలుసా..?

by Anji
Ad

బొప్పాయి పండు తెలియ‌ని వారుండ‌రు. మనలో చాలామంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. ఇతర పండ్ల మాదిరిగా బొప్పాయి పండు కూడా అనేక పోషకాలను కలిగి ఉంటుంది. దీనిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బొప్పాయి పండును తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

బొప్పాయి పండును రోజూ తినడం వల్ల కంటిలో శుక్లాలు తొలగిపోయి కంటి చూపు మెరుగు పడుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీనిలో అధికంగా ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. తరచూ బొప్పాయి పండును తింటూ ఉండడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, పలు రకాల క్యాన్సర్ వంటి వ్యాధులు సంభ‌వించ‌వు. బొప్పాయి పండును తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఈ పండు ఎంతగానో దోహదపడుతుంది. తరచూ దీనిని తినడం వల్ల వృద్ధాప్య చాయలు కూడా తొలగిపోతాయి. బరువు తగ్గడంలో కూడా బొప్పాయి పండు ఎంతో సహాయపడుతుంది.

షుగర్ వ్యాధిగ్రస్తులు బాగా పండిన బొప్పాయిని తినడం వల్ల‌ శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మానసిక ఆందోళనకు గురైనప్పుడు బొప్పాయి పండు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. బొప్పాయి పండు యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. బొప్పాయి పండును, గ్రీన్ టీ ని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. డెంగ్యూ జ్వరం బారిన పడినప్పుడు బొప్పాయి పండును, బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య పెరుగుతుంది. బొప్పాయి ఆకులను శుభ్రంగా కడిగి జార్లో వేయాలి. అందులోనే 1 స్పూన్ నిమ్మరసాన్ని వేసి మిక్సీ పట్టి ఆకుల రసాన్ని తీసి దానికి తేనెను కలిపి తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్ల సంఖ్య పెరుగుతుంది.

Advertisement


ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో సహజంగానే చాలామంది విషజ్వరాల బారిన పడుతుంటారు. కనుక ఈ సమయంలో బొప్పాయి పండును తినడం వల్ల మ‌న శ‌రీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ఈ సీజన్ లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కాబ‌ట్టి బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన జీర్ణ వ్యవస్థలోని క్రిములను నాశనం చేస్తాయి. తెగిన, కాలిన గాయాలపై బొప్పాయి పండు గుజ్జును ఉంచడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. ఇది మ‌న‌కు చాలా మేలు చేస్తుంది కదా అని దీనిని అధికంగా తినకూడదు. బొప్పాయి పండు ను అధికంగా తినడం వల్ల వేడి చేస్తుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఎట్టి పరిస్థితులలోనూ దీనిని తినరాదు. బొప్పాయి పండు కొందరిలో అలర్జీని కలిగిస్తుంది. అదేవిధంగా గుండె జబ్బులతో బాధపడే వారు దీనిని తినకపోవడమే మంచిది. అంతేకాదు ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కూడా దీనిని ఇవ్వకూడదు. ఈ విధంగా బొప్పాయి పండు ను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read : 

ల‌వంగం తీసుకుంటే షుగ‌ర్ శాశ్వతంగా దూర‌మ‌వుతుంద‌ట‌.. ఎలాగో తెలుసా..?

Visitors Are Also Reading