Home » భార‌త్ పాక్ స‌రిహ‌ద్దుల్లో పాక్ డ్రోన్ క‌ల‌క‌లం…!

భార‌త్ పాక్ స‌రిహ‌ద్దుల్లో పాక్ డ్రోన్ క‌ల‌క‌లం…!

by AJAY
Ad

భార‌త్ పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్ సంచారం క‌ల‌క‌లం రేపింది. పంజాబ్ ఫిరోజ్ పూర్ స‌రిహ‌ద్దుల్లో ఈ రోజు తెల్ల‌వారుజామున పాకిస్థాన్ డ్రోన్ సంచరించ‌డాన్ని గుర్తించారు. ఇక ఈ డ్రోన్ గాలిలో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మ‌యంలోనే సైనికులు గుర్తించారు. వెంట‌నే డ్రోన్ ను కూల్చేశారు. ఇక ఈ డ్రోన్ లో నిషేదిత వ‌స్తువులు ఉన్న‌ట్టు సైనికులు గుర్తించారు. డ్రోన్ లో ఓ ప‌సుపు రంగు సంచి క‌నిపించింద‌ని దాంతో కూల్చామ‌ని చెప్పారు.

Advertisement

Advertisement

ఇక ఈ సంచిలో మూడు ప‌సుపు రంగు ప్యాకెట్ లు ఓ న‌లుపు రంగు ప్యాకెట్ ఉంద‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా జ‌మ్మూ క‌శ్మీర్ లోని అవంతి పొర‌లోనూ అల‌జ‌డి చెల‌రేగింది. జైషే మ‌హ్మ‌ద్ కు చెందిన న‌లుగురు ఉగ్ర‌వాద సానుభూతిప‌రుల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అరెస్ట్ చేశాయి. ఆ న‌లుగురు సానుభూతిప‌రులు ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నార‌ని ఆయుధాల త‌ర‌లింపులో స‌హ‌క‌రిస్తున్న‌ట్టు గుర్తించామ‌ని సైనికులు చెప్పారు.

Visitors Are Also Reading