Home » తమ మెన్స్ జట్టు పరువు తీసేసిన పాక్ మహిళా ప్లేయర్..!

తమ మెన్స్ జట్టు పరువు తీసేసిన పాక్ మహిళా ప్లేయర్..!

by Azhar
Ad

పాకిస్థాన్ పురుషుల జట్టు పై ఇప్పుడు విపరీతమైన ట్రోలింగ్ అనేది జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ కప్ లో మొదట ఇండియా చేతిలో చివరి బంతికి ఓడిపోయిన పాకిస్థాన్ జట్టు.. ఆ తర్వాత జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. దానితో అందరూ ఇప్పుడు పాక్ జట్టును ఆడుకుంటున్నారు. అయితే ఈ సమయంలో ఎక్కువగా ఇండియా ఫ్యాన్స్ పాక్ ను ట్రోల్ చేయాలి.. కానీ విరుద్ధంగా పాక్ అభిమానులే తమ జట్టును ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

ఇక తాజాగా పాకిస్థాన్ మహిళల క్రికెటర్ కూడా పురుషుల జట్టుకు ఓ సలహా అనేది ఇచింది. అయితే పాక్ మహిళల జట్టులో కీ ప్లేయర్ గా ఉన్న కైనత్ ఇంతియాజ్ ఓ ట్విట్ అనేది చేసింది. అందులో కేవలం.. విజువలైజ్, ఫోకస్ అండ్ ఎగ్జిక్యూట్ అని మాత్రమే ఉంది. కానీ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఉన్న పాకిస్థాన్ పురుషుల జట్టుకుబాగా సరిపోతాయి.

Advertisement

అందుకే ఈ కామెంట్స్ కైనత్ ఇంతియాజ్ వారి కోసమే చేసింది అంటున్నారు. అలాగే కైనత్ ఇంతియాజ్ ను పురుషుల జట్టుకు కెప్టెన్ గా చేయాలనీ.. బాబర్ ను మహిళల జట్టులో 12వ ఆటగాడిగా పెట్టాలని కూడా కామెంట్స్ చేతున్నారు. అయితే ఈరోజు బాబర్ జట్టు నెదర్లాండ్స్ తో తలపడబోతున్న తరుణంలో.. పాక్ అభిమానులు ఇండియా వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్థాన్ సెమీస్ వెళ్లడం అనేది ఇండియా చేతిలోనే ఉంది.

ఇవి కూడా చదవండి :

బుమ్రా లేకపోయినా గెలుస్తాం..!

ఇండియా గెలుపుపైనా పాకిస్థాన్ ఫ్యాన్స్ ఆశలు..!

Visitors Are Also Reading