Home » ఇండియా గెలుపుపైనా పాకిస్థాన్ ఫ్యాన్స్ ఆశలు..!

ఇండియా గెలుపుపైనా పాకిస్థాన్ ఫ్యాన్స్ ఆశలు..!

by Azhar
Ad
ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్యే ఉండే రైవలరి అనేది అందరికి తెల్సిందే. ఈ రెండు జట్లు క్రికెట్ మ్యాచ్ లో పోటీ పడుతున్నాయి అంటే అందరి చూపు అటు వైపే ఉంటుంది. ఇక మన ఇండియా జట్టు పైన పాకిస్థాన్ విజయం సాధించడం మాత్రమే కాకుండా.. మన ఇండియా జట్టు అన్ని మ్యాచ్ లలో కూడా ఓడిపోవాలని పాక్ ఫ్యాన్స్ కోరుకుంటారు.
కానీ ఇప్పుడు ఆ పాక్ ఫ్యాన్స్ మన ఇండియా అన్ని మ్యాచ్ లలో విజయం సాధించాలని కోరుకుంటున్నారు. అయితే ఈ ఏడాది తమ పాకిస్థాన్ జట్టు టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను సాధిస్తుంది అని ఆ జట్టు ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ మనతో పాటుగా జింబాబ్వే జట్టుతో ఆడిన రెండు మ్యాచ్ లలో పాక్ ఓడిపోయింది. అందువల్ల ఇప్పుడు ఆ జట్టు సెమీస్ కు చేరుకోవడం అనేది ఇండియా జట్టు పైన ఆధారపడి ఉంది.
మన ఇండియా అన్ని మ్యాచ్ లలో గెలిస్తేనే పాకిస్థాన్ కు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అందుకే పాకిస్థాన్ జట్టు తమను మోసం చేసిన.. ఇండియా జట్టు పైన తమకు నమ్మకం ఉంది అని.. రేపు జరిగే మ్యాచ్ లో ఇండియా సౌత్ ఆఫ్రికాను ఓడిస్తుంది అని దాయాధి ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఒకవేళ రేపు మ్యాచ్ లో మనం ఓడిపోతే ఇండియా ఫ్యాన్స్ కంటే.. పాకిస్థాన్ ఫ్యాన్స్ కే ఎక్కువ బాధ అనేది కలుగుతుంది అనడంలో సందేహం లేదు.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading