Home » ఢిల్లీ జట్టులో మరో కరోనా కేసు..!

ఢిల్లీ జట్టులో మరో కరోనా కేసు..!

by Azhar
Ad

ఐపీఎల్ 2022 లో కరోనా గంటలు భారీ ఎంతున్నా మోగుతున్నాయి. ఎంత గట్టి బయో బాబుల ను బీసీసీఐ ఏర్పాటు చేసిన కరోనా కేసులు మాత్రం రావడం ఆగలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో వరుస కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు తాజాగా జట్టులో మరొకరికి కరోనా పాజిటివ్ గా వచ్చింది. కానీ ఆ ఆటగాడు ఎవరు అని మాత్రం బయట పెట్టలేదు.\

Advertisement

 

అయితే ఢిల్లీ జట్టులో మూడు రోజుల కింద మొదటి కరోనా కేసు నమోదయ్యింది. ఆ జట్టు ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హార్ట్ కరోనా బారిన పడ్డారు. అయిన బెంగళూర్ తో మ్యాచ్ ఆడిన ఢిల్లీ జట్టులో మరుసటి రోజు ఆటగాడు మిచెల్ మార్ష్ కు కోవిడ్ పాజిటివ్ గా తెలిసింది. దాంతో ఆ జట్టును క్వారంటైన్ లో ఉంచి కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా… మరో నలుగురికి కరోనా వచ్చినట్లు తెలిసింది.

Advertisement

ఈరోజు ఢిల్లీ జట్టు పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ కారణంగా తాజాగా మళ్ళీ జట్టులో అందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. ఇప్పుడు ఇంకో ఆటగాడికి కూడా కరోనా వచ్చినట్లు తేలింది. అయిన బీసీసీఐ మాత్రం నేటి మ్యాచ్ ను రద్దు చేయలేదు. పూణేలో జరగాల్సిన ఈ మ్యాచ్ ను ముంబైకి మార్చి.. యథావిధిగా మ్యాచ్ ను నిర్వహిస్తుంది.

ఇవి కూడా చదవండి :

దీపం వెలిగించే సమయంలో పాటించాల్సిన నియమాలేంటి..?

ఐపీఎల్ లో కరోనా కేసులు.. బీసీసీఐ కీలక నిర్ణయం…!

Visitors Are Also Reading