Home » Sr.NTR Family: నంద‌మూరి కుటుంబంలో విషాదం.. !

Sr.NTR Family: నంద‌మూరి కుటుంబంలో విషాదం.. !

by Anji
Ad

దివంగ‌త స్టార్ హీరో, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి నంద‌మూరి తారాక రామారావు చ‌రిత్ర తెలియ‌ని వారుండ‌రు ఆయ‌న న‌ట వార‌సత్వాన్ని పుణికి పుచ్చుకుని ఎంతో మంది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా బాల‌కృష్ణ‌,ఎన్టీఆర్ వంటి హీరోలు స్టార్లు అయ్యారు. ఇక క‌ళ్యాణ్ రామ్ కూడా త‌న‌దైన శైలిలో అటు నిర్మాత‌గా.. ఇటు హీరోగా రాణిస్తున్నారు. సీనియ‌ర్ ఎన్టీఆర్ కుమారులు అంద‌రికీ తెలుసే. కానీ కూతుర్ల‌లో ఒక‌రిద్ద‌రి గురించి త‌ప్ప మిగ‌తా వారికి గురించి ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు.

Advertisement

 

నంద‌మూరి తార‌క రామారావుకి న‌లుగురు కూతుర్లు క‌ల‌రు. వారిలో లోకేశ్వ‌రి, పురంధేశ్వ‌రి, భువనేశ్వ‌రి, ఉమామ‌హేశ్వ‌రి. తాజాగా కంఠ‌మ‌నేని ఉమా మ‌హేశ్వ‌రి మ‌ర‌ణించింది. ఆమె మ‌ర‌ణం అంద‌రినీ విషాదంలోకి నెట్టింది. జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసంలోనే ఉమా మ‌హేశ్వ‌రి క‌న్నుమూశారు. ఉమా మ‌హేమ‌హేశ్వ‌రి మృతితో నంద‌మూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిన‌ట్ట‌యింది. ఈ మ‌ధ్య ఉమా మ‌హేశ్వ‌రి త‌న కూతురు వివాహం ఘ‌నంగా జ‌రిపించింది.

Advertisement


ఎన్టీఆర్ నాలుగ‌వ కూతురు అయిన‌టువంటి ఉమా మ‌హేశ్వ‌రి మీడియాకి చాలా దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఆమె జీవితి విషాదంతో నిండింద‌నే చెప్పాలి. ఈమెకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొద‌టి భ‌ర్త న‌రేంద్ర ఓ శాడిస్ట్. మ‌హేశ్వ‌రిని సిగ‌రేట్ల‌తో సైతం కాల్చేవాడ‌ట‌. ఈ విష‌యం ఎన్టీఆర్ కి తెలిసి విడాకులు ఇప్పించాడు. ఇక కంఠ‌మ‌నేని వారి ఇంటి కోడ‌లిగా చేశారు ఎన్టీఆర్. అయితే అక్క‌డ బాగానే ఉన్న‌ప్ప‌టికి హ‌ఠాన్మ‌ర‌ణం పొందారు. ప్ర‌స్తుతం ఆమె పార్థివ దేహం ఇంట్లోనే సంద‌ర్శ‌న‌కు ఉంచారు. ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల‌తో పాటు బంధువులు, ప‌లువురు ప్ర‌ముఖులు విచ్చేయ‌నున్నారు. ప‌లువురు ఉమామహేశ్వ‌రి మృతి పై సంతాపం తెలుపుతున్నారు.

Also Read : 

బింబిసారను బాహుబ‌లితో పోల్చ‌వ‌ద్దు.. క‌ళ్యాణ్‌రామ్ కామెంట్స్ వైర‌ల్..!

పెళ్లి పీటలు ఎక్కబోతున్న అడివి శేష్.. అమ్మాయి అక్కినేని కొడలేనా..?

Visitors Are Also Reading