Home » ఎన్టీఆర్ అనుష్క క‌లిసి న‌టించాల్సిన ఆ క్రేజీ ప్రాజెక్ట్..మ‌ధ్య‌లోనే ఎందుకు ఆగిపోయిందో తెలుసా..!

ఎన్టీఆర్ అనుష్క క‌లిసి న‌టించాల్సిన ఆ క్రేజీ ప్రాజెక్ట్..మ‌ధ్య‌లోనే ఎందుకు ఆగిపోయిందో తెలుసా..!

by AJAY
Published: Last Updated on
Ad

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సూప‌ర్ బ్యూటీ అనుష్క క‌లిసి ఒక్క సినిమా కూడా చేయ‌లేద‌న్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల ప‌క్క‌న న‌టించిన అనుష్క ఎన్టీఆర్ తో మాత్రం ఒక్క‌సినిమా కూడా చేయ‌లేదు. చింత‌కాయ‌ల ర‌వి సినిమాలో వెంకటేష్ హీరోగా న‌టించగా ఎన్టీఆర్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అనుష్క‌తో క‌లిసి స్టెప్పులు వేశారు. కానీ ఫుల్ లెన్త్ గా ఇద్ద‌రూ స్క్రీన్ పై ఒక్క‌సారి కూడా క‌నిపించ‌లేదు.

Advertisement

 

కానీ నిజానికి ఎన్టీఆర్ అనుష్క క‌లిసి ఓ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సింది. కానీ అది మిస్ అయ్యింది. ఆ సినిమా ఏదో ఎలా మిస్ అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అనుష్క రుద్ర‌మ‌దేవి అనే సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ గోణ‌గ‌న్నారెడ్డి అనే పాత్ర‌లో న‌టించారు. కానీ ఈ సినిమా కోసం గుణ‌శేఖ‌ర్ ముందుగా ఎన్టీఆర్ మ‌రియు మ‌హేశ్ బాబును అనుకున్నార‌ట‌.

Advertisement

అంతే కాకుండా వీరిద్ద‌రినీ గుణ‌శేఖ‌ర్ సంప్ర‌దించిన‌ట్టు కూడా తెలుస్తోంది. అయితే సినిమాలో ఆ పాత్ర నిడివి త‌క్కువగా ఉంద‌నే కార‌ణంతో ఇద్ద‌రూ నో చెప్పారు. ఆ త‌ర‌వాత గుణ‌శేఖ‌ర్ అల్లు అర్జున్ కు క‌థ‌ను చెప్పిఒప్పించార‌ట‌. అలా ఎన్టీఆర్ అనుష్క చేయాల్సిన సినిమా మిస్ అయ్యింది. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో అనుష్క త‌నకంటూ ప్ర‌త్యేక ఇమేజ్ ను సంపాదించుకుంది.

వ‌రుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ప్ర‌స్తుతం అనుష్క అస‌లు సినిమాలే చేయ‌డం లేదు. దాంతో సినియ‌ర్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరిపోయింది. కానీ యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి తో అనుష్క ఓ క్రేజీ ప్రాజెక్టులో న‌టిస్తోంది. మ‌రి ఈ సినిమా అనుష్క‌క ఎలాంటి విజ‌యాన్ని ఇస్తుందో ఊడాలి.

ALSO READ:

స‌మంత పోస్ట్ కు ల‌వ్ యూ టూ అంటూ ప్రీత‌మ్ కామెంట్…ఆ పిలుపుతో రిలేష‌న్షిప్ పై క్లారిటీ..!

విశ్వక్ సేన్-దేవి నాగవల్లి ఇష్యూ… కమెడియన్ ను పొగుడుతూ స్టార్ హీరోలను కడిగిపారేసిన బాబుగోగినేని….!

Visitors Are Also Reading