Home » పాన్ ఇండియాలో ఎన్టీఆర్ ను ఢీ కొట్ట‌బోతున్న‌ చ‌ర‌ణ్ బ‌న్నీ…చివ‌రికి గెలిచేదెవ‌రు..?

పాన్ ఇండియాలో ఎన్టీఆర్ ను ఢీ కొట్ట‌బోతున్న‌ చ‌ర‌ణ్ బ‌న్నీ…చివ‌రికి గెలిచేదెవ‌రు..?

by AJAY
Ad

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్ స్టార్ హీరోలుగా ఉన్నారు. రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ లు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్ లోనే కాకుండా ఆస్కార్ ను సొంతం చేసుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది. అదే విధంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

ALSO READ :రెమ్యున‌రేష‌న్ పై స‌మంత సంచ‌ల‌న వ్యాక్య‌లు…అది చూసి ఇవ్వాలంటూ..!

Advertisement

అయితే ఇప్పుడు ఈ హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో త‌లప‌డ‌బోతున్నారు. అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప పార్ట్ 2 మార్చి 29 విడుద‌ల చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే రామ్ చ‌ర‌ణ్ శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పొలిటిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కుతోంది.

Advertisement

ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవల్ లో విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా పోస్ట‌ర్ ల‌ను విడుద‌ల చేయ‌గా సినీ ప్రియుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకున్నాయి. అయితే ఈ సినిమాను కూడా స‌మ్మ‌ర్ లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న ఎన్టీఆర్ 30 సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ సినిమా ఊర‌మాస్ సినిమా అని ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే ఎన్టీఆర్ 30 సినిమాతో రామ్ చ‌ర‌ణ్ లేదా అల్లు అర్జున్ సినిమా పోటీ ప‌డే ఛాన్స్ ఉన్న‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

also read : రాహుల్ కు ఇందిరా గాంధీకి పట్టిన గతే.. ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు సంచలన ట్వీట్

Visitors Are Also Reading