Home » ఎన్టీఆర్ బాల‌య్య క‌లిసి బాహుబ‌లి రేంజ్ సినిమాలో న‌టించార‌ని తెలుసా..? ఆ సినిమా ఎందుకు విడుద‌ల‌వ్వ‌లేదంటే..?

ఎన్టీఆర్ బాల‌య్య క‌లిసి బాహుబ‌లి రేంజ్ సినిమాలో న‌టించార‌ని తెలుసా..? ఆ సినిమా ఎందుకు విడుద‌ల‌వ్వ‌లేదంటే..?

by AJAY
Ad

తెలుగు చిత్రప‌రిశ్ర‌మ గర్వించ‌ద‌గ్గ న‌టుడు ఎన్టీరామారావు. సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో జ‌న్మించిన ఎన్టీఆర్ పాలు అమ్ముతూ సినిమాల‌పై ఉన్న ఆస‌క్తితో నాట‌క‌రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ త‌ర‌వాత సినిమాల‌పై ఉన్న ఆస‌క్తితో చెన్నై వెళ్లి ఎంతో క‌ష్టప‌డి అవ‌కాశాలు అందుకున్నారు. త‌న న‌ట‌న‌తో స్టార్ హీరోగా ఎదిగారు. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఉన్నాయి. హీరోగానే కుకుండా దర్శ‌కుడుగానూ ఆయ‌న త‌న టాలెంట్ ను నిరూపించుకున్నారు.

Advertisement

ఇక ఎన్టీఆర్ న‌ట‌వార‌సుడిగా నంద‌మూరి బాల‌య్య మ‌ళ్లీ అంత‌టి పేరు ప్ర‌ఖ్యాత‌లు సాధించిన సంగ‌తి తెలిసిందే. బాల‌య్య ప్ర‌స్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఎన్టీఆర్ ద‌గ్గ‌రుండి బాల‌య్య‌కు న‌ట‌న‌లో ఓన‌మాలు నేర్పించారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమాలు కూడా వ‌చ్చాయి. ఇదిలా ఉండ‌గా వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో తీసిన ఓ సినిమా మాత్రం విడుద‌ల‌కు నోచుకోలేదు.

Advertisement

బాల‌య్య ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో జ‌మున హీరోయిన్ గా విశ్వేశ్వ‌ర‌రావు నిర్మాత‌గా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఈ భారీ బ‌డ్జెట్ చిత్రానికి కంచుకాగ‌డ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలోని కొన్ని సీన్ల‌ను కూడా చిత్రీక‌రించారు. బాల‌య్య ఎన్టీఆర్ ల మ‌ధ్య ఎమోష‌న‌ల్ సన్నివేశాల‌ను చిత్రించార‌ట‌. అయితే సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న స‌మ‌యంలో హీరోయిన్ జ‌మున గ‌ర్భ‌వ‌తి అయ్యార‌ట‌.

దాంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. అయితే ఆ త‌ర‌వాత తిరిగి షూటింగ్ ను ప్రారంభించాల‌ని అనుకున్నారు. అంతా షూటింగ్ కు సిద్దం అయ్యారు. కానీ అదే స‌మ‌యంలో సినిమాలో ముఖ్య‌పాత్ర‌లో న‌టించాల్సిన బాలీవుడ్ న‌టుడు మృతిచెందాడు. ఆ ఘ‌ట‌న‌తో మ‌రోసారి వాయిదా ప‌డిన షూటింగ్ తిరిగి ప్రారంభం అవ్వ‌లేదు.

Visitors Are Also Reading