నటసార్వభోముడు నందమూరి తారకరామారావు నటించిన తొలి సినిమా పల్లెటూరి పిల్ల. ఈ సినిమాకు సుబ్బారావు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ ఆసక్తికరమైన విషయం జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడంటే రిస్కీ సీన్లను డూప్ లను పెట్టి తీస్తున్నారు కానీ అప్పట్లో డూప్ లు ఉండేవారు కాదు. ఎంత రిస్క్ ఉన్న సన్నివేశాలు అయినా హీరోలే చేసేవారు. ఎన్టీఆర్ పల్లెటూరి పిల్ల సినిమాలో ఓ ఎద్దుతో పోరాట సన్నివేశం ఉంటుంది.
ఈ సీన్ లో నటించేందుకు ఎన్టీఆర్ సిద్దం అయ్యారు. ఆస్ట్రేలియా జాతికి చెందిన సన్నని కొమ్ములు కలిగిన ఎద్దును తీసుకువచ్చారు. దర్శకుడు సుబ్బారావు కేవలం ఎద్దు కొమ్ములు పట్టుకుంటే చాలని చాలా జాగ్రత్తగా ఉండాలని ఎన్టీఆర్ కు చెప్పారు. ఎన్టీఆర్ ఎద్దు కొమ్ములను పట్టుకోగానే అది పైకి లేపి కింద పడేసింది. దాంతో ఎన్టీఆర్ చేతికి తీవ్రంగా గాయం అయ్యింది. ఎన్టీఆర్ నొప్పిని భరించలేకపోతున్నారు.
Advertisement
Advertisement
అక్కడే ఉన్న చిత్తూరు నాగయ్య వెంటనే గ్లాసులో పచ్చ రంగులో ఉన్న మత్తు మందును తీసుకువచ్చారు. ఎన్టీఆర్ ను ఆ మందును తాగాలని దాంతో నొప్పి తగ్గటంతో పాటూ మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటుందని చిత్తూరు నాగయ్య చెప్పారు. కానీ ఎన్టీఆర్ తాను మత్తుమందు తాగనని చెయ్యేకాదు శరీరంలో ఎముకలన్నీ విరిగినా కూడా తాను మందు తాగనని చెప్పారు. దాంతో చిత్తూరు నాగయ్య మీరు జీవితంలో ఎంతో పైకి వస్తారని చెప్పారట.
ఇక వెంటనే ఎన్టీఆర్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ చేతికి కట్టుకట్టి వైద్యం చేశారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు పొగాకు వ్యాపారం చేసేవారు. ఆ సమయంలో చుట్ట తాగటం అలవాటైంది. కానీ సినిమాల్లోకి వచ్చిన తరవాత ఓ దర్శకుడు చుట్ట తాగితే పల్లు పాడవుతాయని హీరోల పల్లు అలా ఉంటే అందంగా ఉండరని చెప్పారు. అంతే కాకుండా ఎన్టీఆర్ చుట్ట తాగుతున్న సమయంలో ఆయన చిన్నకుమారుడు వచ్చి మీరు చుట్ట తాగుతారా అంటూ ప్రశ్నించారు. అప్పటి నుండి ఎన్టీఆర్ చుట్టు ముఖం కూడా చూడలేదు.