Home » ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్బీకేల్లో 7,384 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్బీకేల్లో 7,384 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌

by Bunty
Ad

ఏపీలోని నిరుద్యోగులకు బిగ్‌ అలర్ట్. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వంలోని శాఖల వారీగా ఖాళీగా ఉన్న 7384 పోస్టులను భర్తీ చేయనున్నారు.  518 పశు సంవర్ధక సహాయక పోస్టులు, 1644 ఉద్యాన, 427 వ్యవసాయ, 63 మత్స్య, 22 పట్టు సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క తేల్చారు.

Advertisement

ఏపీలోని 660 మండలాల్లో 10,778 ఆర్బికేలు ఏర్పాటు చేయగా వీటిలో 14, 347 మంది సేవలు అందిస్తున్నారు. ఈ-క్రాప్, ఈ-కేవైసీ, పొలంబడులు, ఉద్యానవన, మత్స్య సాగుబడులు, పశు విజ్ఞాన బడుల నిర్వహణతో పాటు ఇతర రైతు ప్రయోజిత కార్యక్రమాల అమలు కోసం ఆర్బికే సిబ్బంది క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో ఆర్బికేలకు వచ్చే రైతులకు ఆటంకాలు లేకుండా సేవలందించడానికి స్థానికంగా చురుగ్గా ఉండే వాలంటీర్ ను ఆర్బికేలకు అనుసంధానించారు.

Advertisement

మరోవైపు గ్రామస్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందించే సంకల్పంతో 9,160 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను కూడా ఆర్బికెలకు అనుసంధానం చేశారు. వన్ స్టాప్ సొల్యూషన్ సెంటర్స్ గా వీటిని తీర్చిదిద్దడంతో పాటు రైతులకు అందించే సేవలన్నింటిని ఆర్బికేలు కేంద్రంగా అందిస్తున్నారు. దీంతో ఆర్బికేల్లో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్బికేలతో పాటు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సంక్రాంతి లోగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది.

 

READ ALSO : తెలంగాణ అమ్మాయితో హీరో శర్వానంద్ పెళ్లి?

 

Visitors Are Also Reading