Home » NOKIA : లోగో మార్చిన నోకియా… ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం

NOKIA : లోగో మార్చిన నోకియా… ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం

by Bunty
Ad

 

నోకియా కంపెనీ గురించి తెలియని వారుండరు. అప్పట్లో ఓ వెలుగు వెలుగింది నోకియా. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ లో ఎంట్రీతో డీల పడిపోయిన నోకియాను చేజిక్కించుకున్న హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంటూ మళ్ళీ పునర్వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే నోకియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

READ ALSO : Rishab Shetty: రాజకీయాల్లోకి “కాంతార” హీరో రిషబ్ శెట్టి…!

Advertisement

60 ఏళ్ల తర్వాత కంపెనీ కొత్త లోగోను డిజైన్ చేసింది. కంపెనీ కొత్త లోగోలో నోకియా అనే పదం లోని ఐదు అక్షరాలని వేరువేరు రూపాల్లో రూపొందించారు. ఈ లోగో కంపెనీకి సరికొత్త వ్యాపార ప్రణాళికలను అందించడానికి సహాయపడుతుందని కంపెనీ సీఈఓ పెక్క లుండ్ మార్క్ వెల్లడించారు.

Advertisement

READ ALSO : “రైటర్ పద్మభూషణ్” ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే !

బార్సిలోనాలో  గత సోమవారం రోజున ప్రారంభమైన వార్షిక మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో, కంపెనీ వ్యాపార విస్తరణకు సంబంధించి సరికొత్త ప్రణాళికను వెల్లడించినట్లు లుండ్ మార్క్ తెలిపారు. 2020లో కష్టాల్లో ఉన్న నోకియా కంపెనీ అధికారిక పగ్గాలు చేపట్టాక మూడు కీలక మార్పులకు వ్యూహాలు రచించినట్లు లుండ్ మార్క్ చెప్పారు. రీసెట్, వేగవంతం చేయడం, అభివృద్ధి బాట పట్టించడం, ఇందులో మొదటి దశ పూర్తి కావడం వల్ల ప్రస్తుతం రెండో దశ ప్రారంభమవుతుందని అన్నారు.

READ ALSO :  12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచి మనోజ్

Visitors Are Also Reading