Home » ఆస్ట్రేలియాలో ఇండియా జట్టుకు భద్రత లేదా..?

ఆస్ట్రేలియాలో ఇండియా జట్టుకు భద్రత లేదా..?

by Azhar
Ad

ప్రస్తుతం సెమీస్ దశకు వచ్చిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022 అనేది ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఇక దీనికోసమే అక్కడికి వెళ్లిన భారత జట్టుకు సరైన భధ్రత అనేది లేదు అంరు కొన్ని వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం అక్కడ మన జట్టుకు ఎదురవుతున్న ఘటనలే. మొదట అక్కడ మన ఆటగాళ్లకు సరైన ఫుడ్ అనేది ఇవ్వలేదు. ఈ విషయం బాగా వైరల్ అయ్యింది.

Advertisement

ఇక ఆ తర్వాత మన ఆటగాళ్లను హోటల్ కు తీసుకెళ్లడానికి బస్సు రాకపోవడంతో వారు దాదాపు కిలో మీటర్ కు పైగా నడుచుకుంటూ వెళ్లారు. దీనికి సంబంధిచిన వీడియోలు అనేవి వైరల్ అయ్యాయి. ఇక ఇండియా మ్యాచ్ మధ్య లో ఓ పాకిస్థాన్ అభిమాని మన ఆటగాళ్ల వద్దకు క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత కోహ్లీ రూమ్ లోకి ఎవరో వెళ్లి.. మొత్తం విడో తీసిన విషయం తెలిసిందే.

Advertisement

ఇక ఈ విషయం ఎంతలా వైరల్ అయ్యింది అనేది అందరికి తెలుసు. దీని పై కోహ్లీ కూడా సీరియర్ అయ్యాడు. అలాగే ఈరోజు జింబాబ్వేతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా మరో అభిమాని గ్రౌండ్ లోకి వచ్చేసాడు. ఇలా ఒకదాని వెనుక మరో ఘటన అనేది జరుగుతూ వస్తుండటంతో ఇండియా జట్టుకు ఆసీస్ లో సరైన భద్రత అనేది లేదు అని సోషల్ మీడియాలో వార్తలు అనేవి వైరల్ అవుతున్నాయి. చూడాలి మరి బీసీసీఐ ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుంది అనేది.

ఇవి కూడా చదవండి :

బాబర్ రికార్డ్ బద్దలు కొట్టిన రోహిత్..!

ఫైనల్ లో తలపడనున్న ఇండియా, పాకిస్థాన్..?

Visitors Are Also Reading